Home / NATIONAL / ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో షాక్‌..

ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో షాక్‌..

దిల్లీ: ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో షాక్‌ ఇచ్చింది. వడ్డీరేటును తగ్గించాలని నిర్ణయించింది. 2021-2022 ఫైనాన్సియల్‌ ఇయర్‌కు పీఎఫ్‌పై 8.1 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. ఈ మేరకు ఈరోజు నిర్వహించిన ఈపీఎఫ్‌వో బోర్డు (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2020-2021 ఫైనాన్సియల్‌ ఇయర్‌లో ఈ వడ్డీ 8.5 శాతం ఉండగా ఇప్పుడు దాన్ని 8.1 శాతానికి తగ్గించనున్నారు.

ఈపీఎఫ్‌పై ఇంత తక్కువ వడ్డీ రేటు చెల్లించడం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి. 1977-1978 ఫైనాన్సియల్‌ ఇయర్‌లో 8.1 శాతం ఇచ్చారు. ఆ తర్వాత క్రమంగా దాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఓ దశలో వడ్డీరేటు 8.8 శాతం (2015-2016) కూడా చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ తగ్గుతూ వచ్చింది.

2019-2020 ఆర్థిక సంవత్సానికి 8.5 శాతం చెల్లించగా.. కొవిడ్‌ పరిస్థితులతో 2020-2021 ఆర్థిక సంవత్సరంలోనూ అదే రేటును కొనసాగించారు. ఇప్పుడు మరింత తగ్గిస్తూ 8.1 శాతంగా నిర్ణయించారు. ఈపీఎఫ్‌ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికశాఖకు పంపనున్నారు. అక్కడ ఆమోదం లభించిన తర్వాత చందాదారుల అకౌంట్లలో 8.1 శాతం వడ్డీని లెక్కించి జమ చేయనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat