Home / SLIDER / వెస్టిండీస్ పై టీమిండియా విమెన్స్ ఘన విజయం

వెస్టిండీస్ పై టీమిండియా విమెన్స్ ఘన విజయం

విమెన్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో  టీమిండియా విమెన్స్  జట్టు వెస్టిండీస్ జట్టు మీద 155 పరుగుల భారీవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో  టీమిండియాకు ఇది రెండవ విజయం. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసిన భారత జట్టు, కేవలం 40.3 ఓవర్లలో వెస్టిండీస్ జట్టుని 162 పరుగులకే ఆలౌట్ చేసి, 155 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

టీమిండియా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ విమెన్స్  స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ వరల్డ్ కప్ పోటీల్లో భారీ స్కోరు సాధించింది. స్మృతి మందాన 119 బంతుల్లో 13 బౌండరీలు, రెండు సిక్సర్లతో 123 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలచింది.

మరోవైపు  హర్మన్ ప్రీత్ కౌర్ 107 బంతుల్లో 10 బౌండరీలు రెండు సిక్సర్లతో 109 పరుగులు చేసింది. 318 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు, భారత బౌలర్ల ధాటికి 162 కే ఆలౌట్ అయ్యింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat