విజయవాడ: బడ్జెట్పై చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారనే కారణంతో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బాల వీరాంజనేయ స్వామిపై సస్పెన్షన్ వేటు వేశారు.
సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ సభ్యుల సస్పెన్షన్పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఐదుగురు టీడీపీ సభ్యులను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరారు. అనంతరం స్పీకర్ వాళ్లందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.