మీకు పాన్ కార్డు ఉందా? ఉంటే దాన్ని ఆధార్తో లింక్ చేశారా? లేదా? చేయకపోతే మాత్రం ఏప్రిల్ 1 నుంచి మీరు ఫైన్ కట్టాల్సిందే. పాన్-ఆధార్ లింక్ చేసే గడువు మార్చి 31తో ముగిసిపోనుంది. ఈ గడువులోపు లింక్ చేసుకోకపోతే రూ.500 నుంచి రూ.1000 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటన వెల్లడించింది.
మార్చి 31 తర్వాత జూన్ 30 వరకు లింక్ చేసేవారు రూ.500, ఆ తర్వాత లింక్ చేసేవారు రూ.1000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మార్చి 31లోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే అలాంటి పాన్ కార్డులు ఆ తర్వాత ఇన్యాక్టివ్ అయిపోతాయి. మళ్లీ ఫైన్ కడితేనే యాక్టివ్ అవుతాయి. బ్యాంకింగ్, ఆన్లైన్, యూపీఐ సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే వెంటనే పాన్-ఆధార్ లింక్ చేసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ‘ఈ-ఫైలింగ్’లో పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చు. లేదంటే దగ్గరలోని మీసేవ కేంద్రాలకు వెళ్లినా చేయించుకోవచ్చు.