బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అతివేగంతో మెట్రోపిల్లర్ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్లోని ఖైరతాబాద్లో చోటు చేసుకుంది.
కర్ణాటకకు చెందిన మోహిన్ (23), ఒబేద్(22) హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఎర్రమంజిల్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్ ఆలయం ఎదురుగా మెట్రో పిల్లర్ను ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు బైకు ధ్వంసం అయింది.
పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.