తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన మరో జంట విడాకులకు సిద్ధమైందా? అవుననే ప్రచారమే జోరుగా జరుగుతోంది. ఢీ, రెడీ, నమో వెంకటేశ, దూకుడు, బాద్షా తదితర సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ శ్రీనువైట్ల జంట ఈ విడాకులకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీను నుంచి ఆయన భార్య రూప విడాకులు కోరుతున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవల ఆమె నాంపల్లి కోర్టును కూడా ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది.
2003లో శ్రీను వైట్లకి రూపతో పెళ్లి జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబ కలహాలతో ఎప్పటి నుంచో విడాకుల కోసం రూప ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు కొన్నాళ్లు కలిసి ఉన్నారని.. కానీ ఇప్పుడు మాత్రం విడాకులు తీసుకునేందుకే ఆమె సిద్ధపడుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫిషియల్ సమాచారం అయితే బయటకు రాలేదు.