‘వందేభారత్’ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో డెవలప్ చేసిన సెమీ హైస్పీడ్ ట్రైన్ అదరగొట్టింది. ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది. గంటకు 180కి.మీ వేగాన్ని నమోదు చేసింది.
ట్రైన్ ట్రయల్ రన్ సమయంలో దాని వేగాన్ని స్పీడో మీటర్తో చెక్ చేశారు. స్మార్ట్ ఫోన్లో స్పీడో మీటర్ ఆయప్ డౌన్లోడ్ చేసి అందులో వేగాన్ని చెక్ చేయగా అత్యధికంగా 183కి.మీ స్పీడ్ నమోదైంది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విటర్లో పోస్ట్ చేశారు.
తొలుత న్యూదిల్లీ- వారణాసి మార్గంలో మొదటి రైలు, దిల్లీ-వైష్ణోదేవీ (జమ్మూ) మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు. లేటెస్ట్గా కోటా (రాజస్థాన్)- నగ్దా (మధ్యప్రదేశ్) సెక్షన్లో ట్రయల్ రన్ నిర్వహించారు. రానున్న మూడేళ్లలో దేశవ్యాప్తంగా 400 వందే భారత్ సెమీ స్పీడ్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియను రైల్వేశాఖ వేగవంతం చేసింది.