భోపాల్లో హృదయాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి చనిపోతే పోస్ట్మార్టం కోసం ఆ పాపను భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ బస్టాండ్ వరకు వెళ్లి అక్కడ అందరి లాగే బస్సులో ప్రయాణించాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ.. కంట నీరు తెప్పిస్తోంది.
భోపాల్లో 4 ఏళ్ల చిన్నారి తన స్వగ్రామంలో ప్రమాదవశాత్తూ చనిపోయింది. దీంతో పోస్ట్మార్టం కోసం పాప మృతదేహాన్ని ఛాతర్పుర్లోని గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. తిరిగి గ్రామానికి తీసుకొచ్చేందుకు ఆ వ్యక్తి దగ్గర డబ్బులు లేక పోవడంతో నరకం చూశాడు. వద్ద హాస్పిటల్ దగ్గర కూడా వాహనం అందుబాటులో లేదు. చేసేదేమీ లేక పాప మృతదేహాన్ని బస్టాండ్ వరకు భుజంపై ఎత్తుకొని తీసుకెళ్లాడు. అక్కడ అందరిలానే బస్సు ఎక్కాడు. అయితే బస్సు టికెట్ తీసుకోడానికి కూడా డబ్బులు లేక తోటి ప్రయాణికుడు ఒకరు టికెట్ తీశారు.