GO 1: జీవో నంబరు 1కు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వెల్లడించారు.
జీవో నంబర్ 1పై సస్పెన్షన్ కొనసాగించాలని తెదేపా తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరగా……నిరాకరించింది.
రోడ్ షోలు, ర్యాలీలపై సర్కారు ఎలాంటి నిషేధం విధించలేదని….. ప్రజల రక్షణపై పూర్తి అధికారం సర్కారుదేనని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. తెదేపా సభలో 8 మంది చనిపోవడంతోనే సర్కారు జీవో తెచ్చిందని అన్నారు.