KTR: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పై ట్విట్టర్ వేదికగా ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే……..దూరదర్శన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇష్టానుసారం మట్లాడారని విరుచుకుపడ్డారు. పైగా ఒకే అబద్ధాన్ని ముగ్గురూ ఒక్కోలా చెప్పారని మండిపడ్డారు.
రాష్ట్రానికి వైద్య కళాశాలల అంశంలో…..కేంద్ర మంత్రులు ఒకరికి మించి మరొకరు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రులంతా ఏకమై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
వైద్య కళాశాల కోసం ఒక్క ప్రతిపాదన కూడా రాలేదని….కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ అంటున్నారు. అటు 2 ప్రతిపాదనలే వచ్చాయని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ అంటున్నారు. ఇక్కడే తెలిసిపోతోంది….కేంద్రమంత్రులు కూడపలుక్కుని అబద్ధాలు చెబుతున్నారని.
అబద్ధాలు చెప్పిన ముగ్గురు కేంద్రమంత్రుల్లో కిషన్రెడ్డి గొప్ప మేథావి అని ఎద్దేవా చేశారు. అంతేగాక హైదారాబాద్లో ఆయుష్ పేరిట గ్లోబల్ మెడికల్ సెంటర్ ఏర్పాటు గురించి కిషన్రెడ్డి చేసిన ప్రకటన ఒట్టి బూటకమని విమర్శించారు. అసలు తెలంగాణలోనే లేని 9 మెడికల్ కళాశాలలను సృష్టించిన కీర్తి…..కిషన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు.
కేంద్రం అబద్ధాలతోనే కాలక్షేతపం చేస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రధాని సారథ్యంలో అందరూ అబద్ధాలు చెప్పడంలో ఘనులయ్యారని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ నోటికొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడం దారుణమని అన్నారు.