Home / POLITICS / gangula: సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి గంగుల

gangula: సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి గంగుల

gangula: క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని తీగలగుట్టపల్లి, ఖాజీపూర్ గ్రామాల్లో 5.5 కోట్ల రూపాయలతో నూతనంగా మంజూరైన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి గంగుల భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి గంగుల స్పష్టం చేశారు. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ను తీగలగుట్టపల్లి, ఖాజీపూర్ గ్రామస్థులు ఘనంగా సత్కరించారు.

సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల ప‌లు గ్రామాలకు లో ఓల్టేజీ స‌మ‌స్య తీర‌డంతో పాటు నిరంతరం నాణ్యమైన‌ విద్యుత్ అందుతోందని మంత్రి పేర్కొన్నారు. తీగలగుట్టపల్లిలో 2.5 కోట్ల రూపాయలతో, ఖాజీపూర్‌లో 3 కోట్ల రూపాయలతో సబ్ స్టేషన్‌ల‌ను నిర్మిస్తున్నామని వెల్లడించారు.

మెరుగైన విద్యుత్తు సేవలను అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి అన్నారు. డిమాండ్‌కు తగినట్లు విద్యుత్ సరఫరాపై దృష్టి సారించిన యంత్రాంగం…. లో ఓల్టేజీ సమస్య అధిగ‌మించేందుకు చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని కొత్త ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.

గతంలో ఈ ప్రాంతంలో సాగు రైతులు విద్యుత్‌ సరఫరా లేక రైతుల ఇబ్బందుల దృష్ట్యా 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోక ముందు విద్యుత్‌ కోతలు ఉండేవని తెలిపారు. అధికారంలోకి వచ్చాక నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని మంత్రి అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat