Home / POLITICS / jagadeesh: మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో భారాసలో చేరికలు
minister jagdish reddy fires on central govt

jagadeesh: మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో భారాసలో చేరికలు

jagadeesh: సూర్యాపేటకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో భారాసలో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రం తప్పుడు చర్యలకు పూనుకుంటోందని మంత్రి మండిపడ్డారు. కేంద్రం చేసే పనులకు దేశ ప్రజలంతా భారం మోయాల్సి వస్తోందని విరుచుకుపడ్డారు.

విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదానీలను పెంచి పోషించడానికే ప్రధాని మోదీ ముందుంటారని విమర్శించారు. ప్రైవేటు సంస్థల డిమాండ్ మేరకే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలంటూ కేంద్రం…. రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోందని దుయ్యబట్టారు.

కేంద్రం …..ప్రభుత్వ రంగసంస్థలను తమ స్నేహితులకు కట్టబెడుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆస్తులు దోచి పెట్టడం తప్ప…..దేశ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. భాజపా గల్లీ నేతలు సరైన అవగాహన లేక మిడి మిడి జ్ఞానంతో ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టె ప్రసక్తేలేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను మంత్రి మరోసారి గుర్తు చేశారు.

డిమాండ్ నుగుణంగా విద్యుత్ సరఫరాకు రాష్ట్రం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం, ఎన్‌టీసీపీ నిర్లక్ష్యం వల్లే కారణంగా వచ్చిన విద్యుత్ సరఫరాలో తప్పులను ముఖ్యమంత్రి ఆదేశాలతో అధిగమించామని తెలిపారు. డిమాండ్ దృష్ట్యా విద్యుత్ కొని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat