Home / POLITICS / MLA Gadari Kishore : రేవంత్ చేస్తుంది పాదయాత్ర కాదు కాంగ్రెస్కు పాడి కట్టే యాత్ర.. గాదరి కిషోర్

MLA Gadari Kishore : రేవంత్ చేస్తుంది పాదయాత్ర కాదు కాంగ్రెస్కు పాడి కట్టే యాత్ర.. గాదరి కిషోర్

MLA Gadari Kishore బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తాజాగా పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది పాదయాత్ర కాదని కాంగ్రెస్కు పాడికట్టే యాత్ర అని అన్నారు. తెలంగాణ అమరవీరుల గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పుకొచ్చారు.

బిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తాజాగా సీఎం కేసీఆర్ పై కానీ టిఆర్ఎస్ పార్టీపై కానీ తప్పుడు ప్రచారం చేస్తే ఒప్పుకునేది లేదంటూ ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేస్తున్నది పాదయాత్ర కాదని అన్నారు. అలాగే రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసే బతుకుతున్నారని ఆయన రాజకీయ బ్రోకర్ అంటూ విమర్శించారు. సచివాలయం, అమరవీరుల స్మారక కేంద్రం, బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో అవినీతి జరుగుతుందంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని.. తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పుకొచ్చారు. అలాగే సమాచార హక్కు చట్టాన్ని బ్లాక్మెయిలింగ్ వాడుకునే రేవంత్ ఇప్పుడు ఈ విషయాలపై కూడా సమాచారం తీసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదని చెప్పుకొచ్చిన గాదరి కిషోర్.. అమరవీరులకు కారణం రేవంత్ తేనని అన్నారు. వెయిటర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డికి ఎన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వారిని మోసం చేయడం ఎవరికీ సాధ్యం కాదని అన్ని విషయాలు ముందు ముందు బయట పడతాయని హెచ్చరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat