Home / ANDHRAPRADESH / ప్రజాసంకల్పయాత్రలో ఆసక్తికరమైన సన్నివేశం..

ప్రజాసంకల్పయాత్రలో ఆసక్తికరమైన సన్నివేశం..

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నాలుగో రోజు గురువారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది . ఈ క్రమంలో ఉదయం 8.42 గంటలకు ఉరుటూరులో ప్రారంభమైన జగన్ పాదయాత్ర జమ్మలమడుగు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఉరుటూరు, స్వరాజపేట, పెద్దపాడు, తురకపల్లె, కోడూరు తదితర గ్రామాల సరిహద్దుల్లో వైఎస్‌ జగన్‌కు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. కోడూరు నది వంతెన పైనుంచి మహిళలు, యువకులు, అభిమానులు వైఎస్‌ జగన్‌కు అభివాదం చేశారు. అయితే ఇక్కడే ఒక అరుదైన సంగటన చోటుచేసుకుంది. పది కాదు.. ఇరవై కాదు.. 80 నుంచి 90 మధ్య వయసున్న వృద్దులు. కానీ ఎన్నో ఏళ్ల నుంచి వారికి ఒకటే కోరిక. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడిని చూడాలని..మాట్లాడాలని. కానీ పాదయాత్రగా వస్తున్న జగన్‌ వెంట లక్షలాది మధ్య తాము కలుస్తామో లేదోనన్న ఆందోళన ఆ వృద్ధులది. ఎలాగైనా మాట్లాడాలని నిర్ణయించుకుని రోడ్డుపై నిలబడ్డారు. వారే ఎర్రగుంట్ల మండలంలోని పెద్దనపాడుకు చెందిన బజార్‌బీ (బీబీ), అంకమ్మ. ఇద్దరూ పలువురు మహిళలతో కలిసి ప్రజా సంకల్పం పాదయాత్రలో వస్తున్న వైఎస్‌ జగన్‌ను కలిశారు. మాకోసం ఇంత కష్టపడుతున్నావ్‌.. నువ్వు చల్లంగుండాలి.. మాలాంటోళ్లకు కొడుకులాగా అండగా నిలబడాలని దీవించారు. జగన్‌ని కలశామన్న వారి ఆనందానికి అవధుల్లేవు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat