ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్ వెలుగు చూసింది. ఘనా దేశంలో మార్బర్గ్ వైరస్ను కనుగొన్నారు. ఇటీవల రెండు కేసులు నమోదు కాగా తాజాగా ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ధ్రువీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వారితో సన్నిహితంగా మెలిగిన 34 మందిని గుర్తించినట్లు వెల్లడించింది.
ఆస్పత్రిలో చనిపోయిన ఇద్దరు బాధితుల్లోనూ డయేరియా, జ్వరం, వికారం, వాంతుల వంటి లక్షణాలు కనిపించినట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది. ప్రస్తుతం వారిని క్వారంటైన్లో ఉంచి వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. ఈ వైరస్ మరింత వ్యాప్తిచెందే అవకాశం ఉన్న దృష్ట్యా కట్టడి చర్యలకు తీసుకున్నట్లు తెలిపింది.