Politics ఆంధ్రా గవర్నమెంట్ ఇప్పటికే నిరుద్యోగ యువత కోసం పళ్ళు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే గ్రూప్ వన్ టూ త్రీ కేడర్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి అయితే ఇప్పటివరకు వీటికి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మాత్రమే ఉండగా ఇకనుంచి కంప్యూటర్ టెస్ట్ కూడా తప్పకుండా ఉందని తాజాగా చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన కార్యదర్శి పోలా భాస్కర్.
గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 కేడర్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇకమీదట ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలతో పాటు( సి పి టి)అనగా కంప్యూటర్ proficiency test కు కూడా ఉత్తీర్ణత సాధించవలసి ఉంటుంది. కంప్యూటర్ proficiency test అనేది 100 మార్కులకు కి వుంటుంది అని టైం 60 నిమిషాలు అని తెలియజేశారు. టెస్ట్ కు సంబంధించిన సిలబస్ , పరీక్ష విధానంను ఉత్తృవు లో పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన కార్యదర్శి పోలా భాస్కర్ ఈరోజు జీవో నెంబర్ 26 అనేటువంటి ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మరియు గ్రూప్ త్రీ రాసేటటువంటి అభ్యర్థులకు ఈ జీవో అనేది వర్తిస్తుంది. మిగిలిన వారంతా ముందు రాసిన విధంగానే పరీక్ష ఉంటుందని తెలిపారు.
కాగా నిరుద్యోగ యువత కోసం ఇప్పటివరకు పలు నోటిఫికేషన్ అందించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తాజాగా కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగా మిగిలిన వాటికి కూడా త్వరలోనే నోటిఫికేషన్ రానిందని తెలిపింది అలాగే సచివాలయం నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.