జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ మరోసారి కామెంట్స్ చేశారు. పవన్ స్థాపించిన పార్టీ జనసేన కాదు.. అది కాపుసేన అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. గతంలో చిరంజీవి స్థాపించిన పీఆర్పీకి 18 సీట్లన్నా వచ్చాయి.. జనసేనకు ఒక్క సీటుకూడా రాదని తేల్చి చెప్పారు. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఆంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విజయవాడలో జనసేన కార్యకర్తలో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. నాకు కులమే కాదు, కుటుంబ భావన కూడా లేదని.. కులాల ఐక్యత ఉన్న అమరావతి కావాలని… అప్పుడే జనసేన ఆశయాలు నెరవేరుతాయని ఉద్వేగంగా ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే పవన్ వ్యాఖ్యలు ఏమాత్రం నమ్మ సఖ్యంగా లేవంటూ.. కుల రాజకీయాలకు వ్యతిరేకం అన్న పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎలా ఉంటారని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కులసమీకరణాలతోనే జరుగుతాయని తెలియదా అంటూ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కాదని ఆయన రాజకీయ అజ్ఞానవాసి అంటూ దుయ్యపట్టారు కత్తి మహేష్. రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్న పవన్.. కాపు రిజర్వేషన్లకు ఎలా మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్లా తయారయ్యాడని.. చంద్రబాబుకు ఎప్పడు అవసరం పడుతుందో అప్పుడు ఈ అజ్ఞానవాసిని తెరపైకి తెస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీని పవర్ లోకి తీసుకు రావడం కోసమే ఈయన పవర్ పనిచేస్తుందని.. రాష్ట్రంలో ఏదైనా బర్నింగ్ టాపిక్ ఉంటే దాని వల్ల ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన పరిస్థితులల్లో ప్రజల మైండ్ సెట్ను డైవర్ట్ చేసేందుకు పవర్ స్టార్ ప్రత్యక్షం అవుతున్నారన్నారు. ఆయన చంద్రబాబు పిలిస్తే వచ్చి వాగడం.. పని అయిపోయిన తరువాత మళ్లీ షూటింగ్లకు వెలిపోతారు. ఇదో పెద్ద డ్రామా అంటూ పవన్ పైన టీడీపీ సర్కార్ పైన కత్తి మహేష్ విమర్శల దాడి చేశారు.