Home / SLIDER / తెలంగాణలోని ప్రతి అంగుళం భూమి లెక్కతేలాలె..సీఎం కేసీఆర్

తెలంగాణలోని ప్రతి అంగుళం భూమి లెక్కతేలాలె..సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటిలోని అన్ని రకాల భూములకు సరైన లెక్కలుండాలని, ప్రతీ అంగుళం భూమికి ఎవరు యజమానో తేల్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూముల వివరాల నిగ్గు తేలిందని, ఇదే తరహాలో పట్టణాలు, నగర ప్రాంతాల్లో కూడా ప్రతీ భూమి తేల్చాలని సిఎం పేర్కొన్నారు . మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించినందున, మార్చి 5 నాటికే పాస్ పుస్తకాలు జిల్లాలకు చేరే విధంగా కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని చెప్పారు. భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా రికార్డులన్నీప్రక్షాళన చేయడంతో పాటు వాటిని పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

సరళమైన విధంగా ఉండే కొత్త పాస్ పుస్తకాలు, పహాణీల రూపకల్పన, భూ రికార్డుల ప్రక్షాళన తదనంతర కార్యక్రమాలు, ధరణి నిర్వహణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంత కుమారి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ల్యాండ్ రికార్డుల విభాగం డైరెక్టర్ వాకాటి కరుణ, మీ సేవ కమిషనర్ వెంకటేశ్వర్ రావు, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు, మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి, ఎమ్మెల్యే ఆలం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎండిసి చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘‘పాస్ పుస్తకాలు, పహాణీల్లో ప్రస్తుతం 31 కాలమ్స్ ఉన్నాయి. కాలక్రమేణా వచ్చిన మార్పుల కారణంగా చాలా కాలమ్స్ అవసరం లేదు. ప్రభుత్వం భూమి శిస్తు వసూలు చేసిన కాలంలో కొన్ని కాలమ్స్ అవసరం ఉండేది. మరికొన్ని కాలమ్స్ అవసరం కూడా ఇప్పుడు లేదు. ఇవన్నీ ఉండడం వల్ల అనవసర గందరగోళం ఏర్పడుతుంది. భూమి రికార్డులకు సంబంధించిన సమగ్ర సమాచారం ‘ధరణి’ ఉంటుంది. రైతుల వద్ద ఉండే పాస్ పుస్తకాలు, పహాణీలో అన్ని వివరాలు అవసరం లేదు. అత్యవసరం అనుకున్న వివరాలుంటే చాలు. రైతు పేరు, ఖాతా నంబరు, సర్వే నెంబరు, విస్తీర్ణం, భూమి పొందిన విధానం లాంటి కొన్ని ముఖ్యమైన కాలమ్స్ ఉంటే సరిపోతుంది. పాస్ పుస్తకాల్లో, పహాణీల్లో పరభాషా పదాలు చాలా వాడుతున్నారు. అవేమీ మన రైతులకు అర్థం కావు. కాబట్టి మన రైతులు వాడే పదాలనే పాస్ పుస్తకాలు, పహాణీల్లో వాడాలి. ఈ మార్పులతో కొత్త పాస్ పుస్తకాలు, పహాణీలు తయారు కావాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

ఏ కాలమ్స్ ఉంచాలి, ఏ కాలమ్స్ తీసేయాలి అనే విషయంలో విస్తృత చర్చ జరిపి నిర్ణయం తీసుకున్నారు. దానికనుగుణంగానే కొత్త పాస్ పుస్తకాలు, పహాణీలు పంపిణీ చేయాలని, పాస్ పుస్తకంపైన ఖచ్చితంగా రైతు ఫోటో ఉంచాలని, ప్రతీ పాస్ పుస్తకానికి ప్రత్యేక నెంబరు కేటాయించాలని నిర్ణయించారు.

‘‘భూ రికార్డుల ప్రక్షాళన గొప్ప విజయం సాధించింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంచు భూమి లెక్క దొరికింది. 93 శాతం భూముల విషయంలో స్పష్టత వచ్చింది. కోర్టు కేసులు, ఇతర వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి పార్ట్ బి లో నిర్ణయం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని భూ రికార్డులు దాదాపు క్లీన్ అయ్యాయి. ఇక పట్టణ, నగర ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. ఇక్కడ కూడా ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తేల్చాలి. భూమి యజమానులను కూడా నిర్ధారించాలి. ప్రైవేటు ఆస్తులకు కూడా సర్వే నెంబర్ల తరహాలో ప్రత్యేక నెంబర్లు కేటాయించే విధానం తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలి. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు తగ్గిపోతాయని ప్రభుత్వం భావిస్తున్నది. పట్టణాలు, నగరాల్లో కూడా ఈ వాతావరణం రావడానికి ఏమి చేయాలనే విషయంపై అధ్యయనం చేయాలి. తెలంగాణ భూభాగంలోని ప్రతీ ఇంచు ఎలా ఉంది. ఎవరి ఆధీనంలో ఉంది. అందులో ఎలాంటి కార్యకలాపం జరుగుతుంది. తదితర అన్ని వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాలి’’ అని అధికారులను సిఎం కోరారు.

‘‘మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలి. దీనికోసం పాస్ పుస్తకాల తయారీ, రవాణా తదితర కార్యక్రమాలను రూపొందించుకోవాలి. మార్చి 5 నాటికి జిల్లాలకు పాస్ పుస్తకాలు అందాలి’’ అని సిఎం ఆదేశించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat