అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇవాళ ( గురువారం ) పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ఏపీ బంద్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ సందర్బంగా ఏపీ బంద్కు సంఘీభావంగా వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజాసంకల్పయాత్ర నిలిపివేశారు. ఈ నేపధ్యంలో ఆయన ఏపీ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలం దుండిగం క్రాస్ జోలగుంటపల్లి శివారు వద్ద బంద్లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి వైఎస్ జగన్ ప్లకార్డులు పట్టుకుని బంద్కు సంఘీభావం తెలిపారు.
