ప్రజల్లో ఉన్న ఆదరణ చేసి ఓర్వలేక.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రాబోవు ఎన్నికల్లో తన కుమారుడు కేఈ శ్యాంబాబుకు ఓటమి తప్పదని భావించే కుమారుడి ద్వారా కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజక వర్గ వైసీపీ మాజీ ఇంచార్ఝ్ చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేయించారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. నీతి, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి అని ,అలాగే స్నేహశీలి, ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తి అంటూ ఆయనతో తన అనుబంధాన్నిఅంబటి రాంబాబు అన్నారు. తెలియబరిచారు. సోమవారం మండలంలోని చెరుకులపాడు గ్రామంలో వైసీపీ నేత దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలనను గాలికొదిలేసిన ముఖ్యమంత్రికి, హత్యా రాజకీయాలు పెంచి పోషిస్తున్న డిప్యూటీ సీఎంకు.. వారు కాని, వారు కుమారులు కాని, టీడీపీకి చెందిన ఎవరైనా రాబోవు రోజుల్లో డిపాజిట్లు కూడా లేకుండా ‘ఫ్యాను’ గాలికి కొట్టుకుపోతారన్నారు. తమ నాయకుడి హత్య జరిగినా చెక్కుచెదరకుండా ఆయన కుటుంబానికి ఆసరాగా ఉన్న వేలాది మంది కార్యకర్తల మనోధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పారు.
నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీసీల పార్టీగా చెప్పుకునే నేటి డూప్లికేట్ టీడీపీ ఆ వర్గాలకు చేసిందేమీలేదని దుయ్యబట్టారు. బీసీలకు ఎవరైనా మేలు చేశారు అంటే అది కేవలం ఎన్టీఆర్, వైఎస్సార్ మాత్రమేనని స్పష్టం చేశారు. రాబోవు రోజుల్లో వైఎస్ జగన్ ద్వారా బీసీలతో పాటు అన్ని సామాజికవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబీకులే పదవులు ఏలుతున్నారు గానీ ఇతరులకు అవకాశాలిచ్చిందేమీలేదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మొట్టమొదటగా ప్రకటించిన పార్టీ అభ్యర్థి కంగాటి శ్రీదేవినేనని, ఆమెను భారీ మెజారిటీతో గెలిపించుకుని ఈ సీటును జగనన్నకు కానుకగా ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే ప్రతి వైసీపీ కార్యకర్త సైనికుడిలా పనిచేసి కంగాటి శ్రీదేవిని గెలిపించుకోవడం ద్వారా దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి ఆశయాలను సాధించుకుందామన్నారు. హత్యా రాజకీయాలకు బెదిరేది లేదని, హత్యలు, అక్రమాలు, ఇతరులు పదవులు అనుభవించరాదనే నీచమైన ఆలోచనలు కేఈ కుటుంబానివని దుయ్యబట్టారు. తన భర్త నారాయణరెడ్డిని కేఈ కుటుంబం హత్య చేయించి తమ ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చూసిందని, అయితే..అది సాధ్యం కాలేదని అన్నారు. కార్యకర్తల అండతో నారాయణరెడ్డి ఆశయాలను సాధిస్తానన్నారు.