ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం గత 4 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తోంది ఎవరు? రాష్ట్ర విభజన ముందు నుంచి హోదా కావాలంటూ నినదిస్తోంది ఎవరు? మడమతిప్పకుండా పోరాటాన్ని కొనసాగిస్తోంది ఎవరు? ఈ అంశాన్నిఆంధ్ర ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది ఎవరు..? పార్టీలకు అతీతంగా ఈ ప్రశ్నలకు ఎవరైనా చెప్పే సమాధానం ఒకటే అది ఏది అంటే ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత జగన్ అని తెలుసు. అంతలా ప్రతి ఒక్కరికి అర్థంమయ్యోలా …పోరాటం చేస్తూనే ఉన్నారు.ఈ విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్క పచ్చ నాయకుడికి తెలుసు. స్వయానా చంద్రబాబు తన కేబినెట్ భేటీలో దీనిపై గగ్గోలుపెట్టిన విషయం కూడా చాలామంది మంత్రులకు తెలుసు. ప్రత్యేక హోద అంశాన్ని జగన్ క్యాష్ చేసుకుంటున్నాడయ్యా, ఏదో ఒకటి చేయండి” అంటూ మంత్రులను బాబు తిట్టిపోసిన సందర్భాలు ఎన్నో. ఇలా అంతా ఈ విషయంలో జగన్ ను పరోక్షంగా ఒప్పుకున్నవాళ్లే. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ కూడా ఇదే విషయాన్ని అంగీకరించారు.
ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు, వైసీపీ ట్రాప్ లో పడ్డారని, అందుకే యూటర్న్ తీసుకున్నారని అన్నారు మోడీ. అలా పరోక్షంగా ఏపీ ప్రత్యేకహోదా ఉద్యమం క్రెడిట్ అంతా జగన్ దే అన్నారు. ప్యాకేజీకి ఒప్పుకోకుండా, జగన్ తరహాలో మొదట్నుంచి ఒకేమాట మీదుంటే బాబు ఇప్పుడిలా అరవాల్సిన అవసరం వచ్చి ఉండేదికాదని పరోక్షంగా కుండబద్దలుకొట్టారు మోడీ. జగన్ చేస్తున్న ప్రజాపోరాటం, దానికి వస్తున్న మద్దతు చూసే చంద్రబాబు స్టాండ్ మార్చుకున్నారు. అంత మాత్రాన బాబు చిత్తశుద్ధితో హోదాకోసం పోరాటం చేస్తున్నట్టు కాదు. జగన్ ఇదివరకే చెప్పినట్టు.. “కేవలం ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం” అనే కాన్సెప్ట్ ప్రకారం బాబు యూటర్న్ తీసుకున్నారు. ప్రధాని పరోక్షంగా హోదా ఉద్యమం ఘనత జగన్ దే అని తేల్చి చెప్పేసరికి చంద్రబాబు అమోమయంలో పడ్డారు.