Home / LIFE STYLE / బంగారు బోనం ఎత్తిన నిజామాబాద్ ఎంపీ కవిత..!!

బంగారు బోనం ఎత్తిన నిజామాబాద్ ఎంపీ కవిత..!!

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ ఎంపీ కవిత వెయ్యి ఎనిమిది మంది మహిళలతో కలిసి ఆదయ్య నగర్ నుంచి ఆలయానికి ఊరేగింపుగా తరలివచ్చారు .అమ్మకు బోనం సమర్పించిన అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ.…తెలంగాణ ఆడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వచ్చాకే రాష్ట్ర పండుగలకు గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అంతకుముందు బంగారు బోనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ నిర్వాహకులు.. బోనాలతో ర్యాలీగా బయలు దేరారు.ఈ ర్యాలీలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డితో పాటు…డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.కొద్దిసేపటి క్రితం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించి సీఎం  మొక్కులు చెల్లించుకున్నారు.

Image may contain: 9 people, people smiling, people standing and crowd

బంగారు బోనం ప్రత్యేకత..

అమ్మవారికి భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారంతో ఈ బంగారు బోనాన్ని తయారు చేయించారు. 3 కేజీల 80 గ్రాముల బంగారాన్ని ఈ బోనం తయారీకి ఉపయోగించారు. రెండు బంగారు పాత్రలు… ఒక బంగారు ప్రమిదను బంగారు బోనం కోసం రూపొందించారు. ఈ పాత్రలపై మొత్తం 285 వజ్రాలను అలంకరిస్తారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat