ఏపీ అధికార టీడీపీ పార్టీ..ప్రతి పక్ష పార్టీలో అప్పుడే టికెట్ల హాడావుడి మొదలైందా..రానున్న ఎన్నికల్లో ఎవరి బలం ఎంత నిరుపించుకోవడం కోసం ఇప్పటికే అన్ని సిద్దం చేసుకుంటున్నారా..అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీనుంచి ఆ పార్టీ కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు బరిలోకి దిగుతున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసి 53,494 ఓట్లు సాధించి అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 8,037 ఓట్ల మెజారిటీతో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 43,742 ఓట్లు సాధించి మూడోస్థానానికి పరిమితమయ్యారు. తరువాత ఏపీ ప్రతి పక్షనేత .వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
అప్పటినుంచి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ కాకినాడ రూరల్ పరిధిలోని కాకినాడ రూరల్, కరప మండలాలతోపాటు కార్పొరేషన్ పరిధిలోని ఆరు డివిజన్లలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల వరకు వైసీపీకి మంచి పట్టు ఉందన్న అంచనాతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరించడంతోపాటు తన గెలుపుపై కన్నబాబుపై వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు, కార్యకర్తలను బుజ్జగిస్తూ వైసీపీలో చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడ కన్నబాబుకే వైసీపీ అభ్యర్థిత్వం ఖరారవ్వడం, పోటీదారులు లేకపోవడంతో అంతా తానై వ్యవహరిస్తూ గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నారు. దాదాపుగా ఈయనకే టిక్కెట్ అని తెలడంతో అయోమయంలో టీడీపీ ..జనసేన పార్టీలు ఉన్నామంట.. ఎందుకంటే బలమైన నాయకుడిని జగన్ నిలబెట్టాడు. మన నాయకులు పోటీ ఇవ్వలేరు అనే భ్రమలో ఉన్నారంట.