ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన కోడలు అక్కినేని సమంతకు ఛాలెంజ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగోవిడుత హరితహారం కార్యక్రమం ఉద్యమంలా ముందుకు కొనసాగుతుంది.ఈ క్రమంలోనే తెలంగాణకు హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది.
ఇటివల ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన ఇంటి ఆవరణంలో మూడు మొక్కలు నాటి సిని యాక్టర్ అక్కినేని నాగార్జునకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ చేసిన గ్రీన్ ఛాలెంజ్ను నాగార్జున ఇవాళ స్వీకరించి.. అన్నపూర్ణ స్టూడియోలో ఇవాళ మూడు మొక్కలు నాటారు. నాగార్జున మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ చేశారు. కరణ్ జోహర్, సమంత, నటుడు ధనుష్కు గ్రీన్ ఛాలెంజ్ చేసినట్లు నాగార్జున ట్వీట్ చేశారు.
Dear @MPsantoshtrs as promised trees Planted at Annapurna Studios along with our staff/Its your turn my friends!! @karanjohar @Karthi_Offl @dhanushkraja and kodalu❤️ @Samanthaprabhu2 to take this green challenge forward? pic.twitter.com/ImejEEoHID
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 2, 2018