సిద్దిపేట మట్టి వినాయకుల పట్టణంగా మార్చుకుందాం అని..ప్లాస్టిక్ , పర్యావరణం పై యుద్ధం చేయాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. జిల్లా కేంద్రంలో అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ,ఎమ్మెల్యే హరీష్ రావు గారి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పూజల్లో , అన్ని కార్యక్రమాల్లో మొదట పూజించేది విగ్నేశ్వరున్నే అని, విఘ్నలు తొలిగించేలా ఆ గణనాథున్ని కోలుస్తామని చెప్పారు.
. అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేటకే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు 9ఏళ్లుగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న ఘనత అమర్ నాథ్ సేవా సమితి కె దక్కిందన్నారు. ప్లాస్టిక్ నిషేదం పై ప్రధాని మోడీ ,దేశం ఇప్పుడు ఆలోచిస్తుంది. కానీ పర్యావరణం , ప్లాస్టిక్ నిషేధం ,మట్టి వినాయకుల పై మనము 9ఏండ్ల కిందటే ప్రారంభించామని చెప్పారు.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రంగురంగుల వినాయకుల వల్ల చెరువులు కలుషితమై చేపలు, జీవకోటి చనిపోతున్నాయని.. చేపల్లోకి ఆ రసాయనాలు చేరి మనం తింటే కడుపులోకి వెళుతున్నాయన్నారు… ప్లాస్టిక్ వస్తువులను కొనడం వల్ల డబ్బులు పెట్టి క్యాన్సర్ వంటి రోగాలు కొనుకున్నవాళ్ళం అవుతున్నామన్నారు..విగ్నేశ్వరుడు భక్తులు తనని ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారనేది చూస్తాడు కానీ ఎంత పెద్ద విగ్రహం పెట్టారనేది కాదన్నారు.. ఏడాదికి15 వేల విగ్రహలు పంచడం అభినందనియమని. జమ్మూకాశ్మీర్ లో అక్కడి భక్తులకు భోజన సౌకర్యం కల్పించడ అనేది మానవ సేవాయే మాధవ సేవా అనే సూక్తి కి నిదర్శనం అమర్ నాథ్ సేవా సమితి అని చెప్పారు..
ప్లాస్టిక్ ను సిద్దిపేట నుండి తరిమిద్దాం భక్తులు అందరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించి, జ్యుట్ సంచులను వాడాలి..వినాయక మండపంలో పూజా కార్యక్రమాలు ప్లాస్టిక్ వాడకుండా పూజా నిర్వహించాన్నారు.. ఈ ఏడాది అన్ని వినాయక మండపాల్లో ప్లాస్టిక్ ప్రి మండపలుగా మారుద్దమని, వచ్చే ఏడాది పట్టణంలో ప్రతి ఇంటికి మట్టి వినాయక విగ్రహలు వార్డుల వారిగా జ్యుట్ బ్యాగుల్లో పంపిణీ చేద్దామని చెప్పారు.. ఈ వినాయక చవితి కి ఒక ప్రత్యేకత ఉందని నియోజకవర్గంలో 40 గ్రామాల్లో ఒకే వినాయకుడు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచింది.. నూటికి నూరు శాతం మట్టి వినాయక పూజలు పూజించే పట్టణంగా తీర్చిదిద్దుదం,ఆ ఘనత మన సిద్దిపేట దక్కాలన్నారు. మట్టి వినాయక పట్టణంగా మారుద్దం. వచ్చే ఏటా 20వేల కు పైగా వినాయకుల పంపిణీ చెయాలని ప్రతి ఇంట్లో మట్టి వినాయకులు ఉండాలన్నారు…
ప్రతి రైస్ మిల్ లో మొక్కలు నాటి గ్రీన్ సిద్దిపేట గా మారుద్దం.. స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా ఆదర్శ సిద్దిపేట గా మారుద్దం దోమలు, ఈగలు లేని సిద్దిపేటగా మారుద్దం.యుద్దాలు చేయాల్సింది పక్క దేశాల మీద కాదు ఈగలు, దోమలు పర్యావరణం పై యుద్దాలు చేయాలని పిలుపునిచ్చారు.. పైలెరియా వంటి రోగాలు విస్తరిస్తోన్నాయని అవి రాకుండా ఉండేందుకు మీ సహకారం తో అవి లేకుండా చేద్దామన్నారు. మొదటి చేసే పూజ కార్యక్రమం విగ్నేశ్వరునిది కాబట్టి ఆయన దయవల్ల మంచి వర్షాలు పడి కాళేశ్వరం నీళ్లొచ్చి అందరూ ఆరోగ్యం గా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు..
Post Views: 393