తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నక్క తొక్కారు అని అర్ధమవుతుంది .గత మూడున్నర ఏండ్లుగా ఆయన ఎదురుచూస్తున్న ఆశయం గవర్నర్ గిరి .మూడున్నర ఏండ్లుగా అదిగో పిల్లి ..ఇదిగో పులి అన్న తరహాలో గవర్నర్ గిరి రేపో మాపో అంటూ మోత్కుపల్లికి మాటలు చెప్తూ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాలం గడుపుతూ వస్తోన్నాడు .
ఈ తరుణంలో ఆయనకు గవర్నర్ గిరి కాకుండా ఎంపీ పదవి ఇస్తాను అని చంద్రబాబు హమీచ్చాడు అని సమాచారం .అందుకే ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న రేవంత్ రెడ్డి వ్యవహారంతో మోత్కుపల్లిని మళ్లీ తెరపైకి తెచ్చారు. రేవంత్కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం నుండి ఒక్క మోత్కుపల్లి మాత్రమే తన గళం విన్పిస్తున్నారు. ఈ సారి ఎంపీ పదవి ఆశ చూపి మోత్కుపల్లిని బాబు ఊరడిస్తున్నారనే విషయం అర్ధమవుతోంది. రాజ్యసభ సీట్ల ఎంపిక విషయంలో చంద్రబాబు అనుసరించే పద్ధతి ఒకటే.
తనకు ఏం లాభం జరుగుతుంది? ఎంత వరకు మేలు జరుగుతుంది? అనేది చంద్రబాబు సిద్ధాంతం. మూటలు ముట్టనిదే సీటు ఇవ్వలేదని ఇప్పటివరకూ జరిగిన ఎంపికలు తెలియజేస్తున్నాయి. అలాంటిది మోత్కుపల్లికి రాజ్యసభ సీటు చంద్రబాబు ఎలా ఇస్తారని నమ్ముతున్నారని కొందరు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.చూడాలి మరి బాబునే నమ్ముకున్న మోత్కుపల్లి నక్క తోక తోక్కుతాడా లేదా అనేది ..?