Home / SLIDER / హుజూర్‌నగర్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్‌, కవిత

హుజూర్‌నగర్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్‌, కవిత

టీఆర్‌ఎస్‌ను అఖండ మెజార్టీతో గెలిపించిన హుజూర్‌ నగర్‌ ప్రజలకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ అనివార్య కారణాలతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయినప్పటికీ టీపీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ గెలవడం రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తోందన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన సైదిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పార్టీ గెలుపుకు అహర్నిశలు కష్టపడిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు కేటీఆర్‌ ధన్యవాదాల తెలిపారు.

‘కేసీఆర్‌పై అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, టీఆర్‌ఎస్‌కు అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్‌నగర్‌ ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన టీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు’అంటూ కవిత ట్వీట్‌ చేశారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat