తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో కాచిగూడ రైలు స్టేషన్ సమీపంలో ఎంఎంటీఎస్ ట్రైన్ ఎదురుగా వస్తోన్న రైలు ఢీకొట్టిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలెట్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న సోమవారం జరిగిన ఈ ప్రమాదంపై కేసును దర్యాప్తు చేయడానికి ముగ్గురు సౌత్ సెంట్రల్ రైల్వే సభ్యులతో కూడిన హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ప్రమాదం జరిగిన తీరును.. ఎలా జరిగింది. ఎవరిది తప్పు అనే కోణంలో విచారణ చేయనున్నట్లు సమాచారం. రేపు బుధవారం హైలెవల్ కమిటీ కాచిగూడ ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నది.
