తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్ధీన్ వ్యవహారంలో ఎంతమాత్రం మార్పు రాలేదని ఆయనతో నిత్యం టచ్ లో ఉండే పాతమిత్రులు చెబుతుండే ప్రధాన మాట మలిదశ ఉద్యమంసమయంలో ఏ విధంగా అందర్నీ కలుపుకొని పోయాడో ..ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అదే విధానాలతో బాబా ముందుకు పోతున్నారనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది .
నిన్న ఆదివారం మధ్యాహ్నం డిప్యూటీ మేయర్ బాబా బల్కంపేట మీదుగా వెళ్ళుతున్నారు .ఇదే మార్గంలో ఉన్న హోటల్ బ్లూ స్టార్ ఎదుట మలిదశ ఉద్యమ సమయం నాటి తన మిత్రులు టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం నాయకులు సాయి చంద్రగౌద్ ,హరినాథ్ ,అధిత్యలు కన్పించారు .వెంటనే తన వాహనాన్ని నిలిపి తన పాత మిత్రులని కలిశారు .
అతి సామాన్యుడిలా హోటల్ లో తన మిత్రులతో కలిసి ఛాయ్ తాగుతూ ముచ్చట్లు పెట్టారు .తనకు ఉన్న ప్రోటో కాల్ ను సైతం పక్కనపెట్టి మలిదశ ఉద్యమం నాటి మధుర జ్ఞాపకాలను తన మిత్రులతో కలిసి నెమరువేసుకున్నారు .డిప్యూటీ మేయర్ బాబా సామాన్యుడిలా ఒక హోటల్ లో తన మిత్రులతో కలిసి తన హోదాను మరిచి సరదాగా మాట్లాడుతూ ఛాయ్ తాగిన ఉదంతం అందర్నీ కర్శించింది .దాదాపు అర్ధగంటపాటు హోటల్ లో గడిపిన బాబా ఉద్యమ సమయంలో అనేక పోరాటాల్లో పాల్గొనడమే కాకుండా టీఆర్ఎస్ లో క్రమశిక్షణ గల సైనికుల్లా ఉంటూ వస్తున్నా కార్యకర్తలను పార్టీ తప్పక గుర్తిస్తుంది అని ఈ సందర్భంగా తన మిత్రులకు భరోసా ఇచ్చారు .