కొత్త సచివాలయం కట్టాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం పై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కొత్త సచివాలయ నిర్మాణ అంశంపై బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వీహెచ్ స్పందించారు. కేసీఆర్ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగాలనుకుంటున్నాడని ఆరోపించారు. కేసీఆర్ దోపిడీని, ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవడానికి పార్టీలన్నీ ఏకం కావాలని కోరారు. బేగంపేట ఎయిర్ పోర్టును రెండో టర్నినల్ నిర్మాణం పేరుతో కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. మరోపక్క.. కొత్త సచివాలయం ప్రతిపాదనపై కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు.
