ఏపీ అధికార పార్టీ టీడీపీ కి రాజధాని ప్రాంతంలోని గట్టి ఎదురుదెబ్బ తగిలింది .ఈ క్రమంలో రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కొద్ది నెలలుగా మాచర్ల మున్సిపల్ పాలకవర్గంలోని టిడిపి కౌన్సిలర్ల మధ్య నడుస్తున్న విభేదాలు తాజాగా తారాస్థాయికి చేరాయి. చైర్పర్సన్ నెల్లూరు మంగమ్మకు వ్యతిరేకంగా వైస్ చైర్పర్సన్ సహా 10 మంది టిడిపి కౌన్సిలర్లు నిన్న బుధవారం రాజీనామా చేశారు.
ఈ మేరకు పత్రాలను టీడీపీ నియోజకర్గ ఇన్చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డికి అందించారు. రాజీనామా పత్రాలిచ్చినవారిలో వైస్ చైర్పర్సన్ షాక్రూన్, వేముల వెంకటకళ్యాణి (10వ వార్డు), శ్రీనివాసరావు (1వ వార్డు), మంజుల వెంకటేశ్వర్లు (11వ వార్డు) తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను వారు ప్రస్తావించారు.
మూడు నెలలుగా టిడిపి కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. వీరిలో ఒక పక్షం కొమ్మారెడ్డి చలమారెడ్డికి అనుకూలంగా మరికొందరు చైర్పర్సన్ నెల్లూరు మంగమ్మకు అను కూలంగా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుండీ వీరి మధ్య విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే అంశమై వాగ్వాదాలు తలెత్తాయి. అనంతరం మూడ్రోజులకే రాజీనామాల ఘట్టం తెరపైకి వచ్చింది.