Home / SLIDER / రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తలసాని

రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తలసాని

కోడంగల్ నియోజకవర్గ   ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి వ్యవహారంపై రాష్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన సభ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ  అసెంబ్లీకి వచ్చిన తలసాని.. మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ గురించి స్పందించాల్సిన అవసరం లేదంటూనే రేవంత్ రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రాజీనామా లేఖ ఇప్పటివరకు స్పీకర్‌కు చేరనేలేదని, ఏదో ఆయనే నేరుగా స్పీకర్‌కు లేఖ ఇచ్చినట్లు బాగా ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి విమర్శించారు. రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ కూర్చున్నా.. తెలంగాణలో కాంగ్రెస్ చేసేదేమీ లేదని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. రేవంత్ చేరికతో ఆట మైదలైంది కాంగ్రెస్‌లోనేనని, పదవుల కోసం ఆ పార్టీలో కొట్లాటలు జరుగుతాయని ఆయన చెప్పారు. సంఖ్యా బలం లేనప్పుడు అవిశ్వాసం మాట ఎందుకు అని మంత్రి ప్రశ్నించారు.ఈ సందర్భంగా తన రాజీనామా లేఖపై కూడా మంత్రి తలసాని స్పందించారు. తన రాజీనామా లేఖ ప్రస్తుతం స్పీకర్ దగ్గరే ఉందని, టీడీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనం అయ్యాక తన రాజీనామా లేఖ అప్రస్తుతమని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat