తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ నేత రేవంత్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరేసమయంలో ఆయనతో పాటుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సీతక్క ,వేం నరేందర్ రెడ్డి తదితర దాదాపు ఇరవై ముప్పై మంది నేతలు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి విదితమే .
ఈ క్రమంలో కోడంగల్ నియోజక వర్గ టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరినవారు మరల టీడీపీ గూటికి చేరారు .ఎంతో హట్ట హసంగా రేవంత్తోపాటు ఢిల్లీ వెళ్లిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు వేణుయాదవ్ నిన్న గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.అయితే గతంలో పార్టీ మారుతున్నట్టు ప్రకటించిన టీఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు చిలుక మధుసూదన్రెడ్డి కూడా తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
టీడీపీని వీడి పెద్ద పొరపాటు చేశానని ఆయన చెప్పినట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ.పెద్దిరెడ్డి గురువారం నాటి సమావేశంలో చెప్పారు. మధు తిరిగి పార్టీలో చేరాలనుకుంటున్నట్టు తనతో చెప్పారని, పార్టీ నాయకులతో మాట్లాడి చెబుతానని మధుకు చెప్పినట్టు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఈ సందర్భంగా తెలిపారు.