ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలోనూ డిజిటల్ బోధన చేపట్టాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రీ ప్రైమరీ-1 నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. 3వ తరగతి ఆపైన ప్రతి తరగతిలోనూ ప్రొజెక్టర్లు పెట్టే ఆలోచన చేయాలన్నారు. నాడు-నేడు కింద పూర్తిచేసుకున్న అన్ని స్కూళ్లలో మొదటి దశ …
Read More »హైదరాబాద్లో భారీ వర్షం.. మరో రెండు రోజులూ ఇంతే!
హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి చిరుజల్లులు పడుతూనే ఉండగా.. సాయంత్రం నుంచి భారీ వర్షం పడింది. ఇటు పటాన్ చెరు నుంచి అటు అబ్దుల్లాపూర్మెట్ వరకు వర్షం కురుస్తూనే ఉంది. అమీర్పేట్, నాంపల్లి, కోఠి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, జీడిమెట్ల, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో …
Read More »సంజయ్ను ఈడీ చీఫ్గా నియమించినందుకు ధన్యవాదాలు: కేటీఆర్ సెటైర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈడీ విచారణ సీఎం కేసీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను ఈడీ చీఫ్గా నియమించినందుకు ధన్యవాదాలు. దేశాన్నినడిపిస్తున్న డబుల్ ఇంజిన్ ‘మోడీ-ఈడీ’ అని దీంతో అర్థమవుతోంది …
Read More »ఇంట్లోని ఆడవాళ్లను బయటకు లాగుతారా?: కేశినేని చిన్ని
టీడీపీ ఎంపీ కేశినేని నాని.. అతడి సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు.. ఎంపీ కారుకు వాడే నకిలీ స్టిక్కర్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బహిర్గతమయ్యాయి. నకిలీ స్టిక్కర్తో ‘టీఎస్07హెచ్ డబ్ల్యూ7777’ నంబరు గల కారు విజయవాడ, హైదరాబాద్లో తిరుగుతోందంటూ కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కారు నాని సోదరుడు చిన్ని …
Read More »మరోసారి ఇలాంటివి జరగొద్దు.. పంజాగుట్ట పీఎస్కు ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ పోలీసులను ఆశ్రయించారు. సినీ నిర్మాత శేఖర్రాజుపై పంజాగుట్ట పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసుతో కోర్టును తప్పుదోవ పట్టించారని.. కోర్టు ఆదేశాలతో ‘లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ ’ సినిమాను నిలుపుదల చేశారని చెప్పారు. నిర్మాత శేఖర్రాజుకు తాను ఇవ్వాల్సిందేమీ లేదని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వర్మ కోరారు. ఆయనే తనకు డబ్బు ఇవ్వాలని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు …
Read More »చిరంజీవిపై కామెంట్స్.. నారాయణ పశ్చాత్తాపం
ప్రముఖ నటుడు చిరంజీవిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను చేసిన కామెంట్స్ చిరంజీవి అభిమానులు, కాపు మహానాడు నేతల్లో కొందరికి ఆవేశం, కొందరికి బాధ కలిగాయని.. వారి బాధను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్మీట్లో నారాయణ మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. అవి లేకుండా రాజకీయాలు ఉండవన్నారు. రాజకీయ భాషను మించి చిరంజీవి గురించి …
Read More »మహేశ్బాబు గారాలపట్టి సితార బర్త్డే.. ఫొటోలివే..
సూపర్స్టార్ మహేశ్బాబు ముద్దుల తనయ సితార పదో పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మహేశ్బాబు సితార ఫోటో సోషల్ మీడియాలో పంచుకుంటూ నా ప్రపంచంలో బ్రైటెస్ట్ స్టార్ సితారాకు హ్యాపీ బర్త్డే… లవ్ యూ అంటూ రాసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, సినీ తారలు, అభిమానుల నుంచి సితారకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. సితార ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వైరల్ అయిన కొన్ని ఫిక్స్ మీకోసం..
Read More »ఆప్షన్ ఏ, బీ, సీ, డీ..! ఇలాంటి ప్రధానిని మీరేమంటారు..!
దేశంలో ద్రవ్యోల్భణాన్ని, చొరబాటుదారులను నియంత్రించలేని ప్రధానమంత్రిని ఏమని పిలుస్తారని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్. పీఎం మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. చైనా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో రెండో గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ శాటిలైట్ పొటోలతో నేషనల్ మీడియా ప్రచురించిన స్టోరీస్ను కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటువంటి ప్రధానిని ఏమని పిలుస్తారంటూ (ఏ) 56 (బి) విశ్వగురు (సి) అచ్చేదిన్ …
Read More »వామ్మో.. నుపుర్ శర్మను చంపేందుకు పాకిస్థాన్ నుంచి వచ్చేశాడు!
మహమ్మద్ ప్రవక్తపై కాంట్రవర్సియల్ కామెంట్స్ చేసిన బీజేపీ మాజీ మహిళా నేత నుపుర్ శర్మను చంపేందుకు ఓ వ్యక్తి ఏకంగా పాకిస్థాన్ వచ్చేశాడు. పాకిస్థాన్లోని మండీ బహుద్దీన్ పట్టణానికి చెందిన రిజ్వాన్ అష్రఫ్ అనే వ్యక్తి రాజస్థాన్ సరిహద్దు నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బందికి అతడు పట్టుబడంతో వారు విచారించారు. నిందితుడి వద్ద 11 అంగుళాల కత్తి ఉన్నట్లు గుర్తించారు. నుపుర్ శర్మను …
Read More »పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్
పోలవరం ప్రాజెక్టు, విలీన మండలాలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. డిజైన్ల ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతోందని.. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయడం లేదు కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. పువ్వాడ అజయ్ వ్యాఖ్యలను బొత్స దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లగా ఆయన స్పందించారు. మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలన్నారు. సాంకేతికంగా ఇబ్బందులుంటే దాన్ని ఎలా పరిష్కరించాలనేదానిపై …
Read More »