సినీనటుడు నరేష్ కుటుంబంలోని వివాదం మరింత ఎక్కువైంది. గతకొంతకాలంగా నటి పవిత్రా లోకేష్తో నరేష్ సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని మైసూర్లో ఓ హోటల్లో వాళ్లిద్దరూ ఉండగా పోలీసులను వెంటబెట్టుకుని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అక్కడికి వెళ్లారు. తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్రా లోకేష్తో నరేష్ సన్నిహితంగా ఉంటున్నారనేది రమ్య రఘుపతి ప్రధానమైన ఆరోపణ. ఈ క్రమంలోనే మైసూర్లో వాళ్లు ఉంటున్న ప్రదేశానికి వెళ్లిన ఆమె.. …
Read More »నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. 1,663 ఉద్యోగాల ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఇంజినీరింగ్విభాగానికి చెందినవే 1,522 ఉన్నాయి. ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖల్లోని ఇంజినీరింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇరిగేషన్లో 704 ఏఈఈ పోస్టులు, 227 ఏఈ, 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, 95 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. తాజా అనుమతులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం …
Read More »రేవంత్.. ఎవర్ని కొడతావ్? నువ్వేమనుకుంటున్నావ్?: మళ్లీ జగ్గారెడ్డి ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం రేగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హా హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) ఆయన్ను కలిసి స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన యశ్వంత్సిన్హాను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ కలవొద్దని టీపీసీసీ …
Read More »ముందస్తుకు బీజేపీ సై అంటే.. మేమూ సై!: తలసాని
తాము మర్యాద ఇచ్చి పుచ్చుకుంటామని.. ఎవరు ఎవరికీ భయపడని టీఆర్ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట ఎయిర్పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళితే తాము కూడా సిద్ధమేనని చెప్పారు. మహారాష్ట్ర తరహా రాజకీయాలు చేస్తే ఒప్పుకోబోమని.. సై అంటే సై అంటామన్నారు. బీజేపీ నేతలు ఆ పార్టీ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ వచ్చారని.. …
Read More »కేసీఆర్లాంటి నాయకుడు దేశానికి కావాలి: యశ్వంత్సిన్హా
దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ వచ్చిన యశ్వంత్ సిన్హా.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జలవిహార్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటం కాదని.. గుర్తింపు కోసం జరిగేది అసలే కాదన్నారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే …
Read More »విజయ్ దేవరకొండ బోల్డ్ లుక్పై సమంత ట్వీట్
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ ‘లైగర్’. లేటెస్ట్గా ఈ సినిమాలో విజయ్ పోస్టర్ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో విజయ్ బోల్డ్ లుక్పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది స్టార్స్ ట్వీట్ చేసి విజయ్ దేవరకొండను అభినందించారు. సమంత స్పందిస్తూ బోల్డ్గా కనిపించేందుకు విజయ్ ధైర్యం చేశాడని.. అతడికి రూల్స్ తెలుసని.. కాబట్టి వాటిని బ్రేక్ చేయగలడన్నారు. …
Read More »కులాన్ని తక్కువ చేసే కుసంస్కారిని కాదు: కేటీఆర్
విశ్వబ్రాహ్మణులను తాను కించపరిచినట్లు కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం అవాస్తవమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిని ఉద్దేశించి అన్న మాటలు ఎవరినైనా నొప్పిస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. కులాన్ని తక్కువ చేసే కుసంస్కారిని తాను కాదని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read More »కిషన్రెడ్డి చేతగాని దద్దమ్మ: బాల్క సుమన్
విభజన చట్టం ప్రకారం కేంద్రం ఒక్క హామీ నెరవేర్చకున్నా కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్నిలదీశారు. హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి తెలంగాణకు కిషన్రెడ్డి ఒక్క మంచి పనైనా చేయించారా? అని ప్రశ్నించారు. చేతగాని దద్దమ్మగా ఆయన మిగిలిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్రెడ్డిని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో ఉన్న గుమస్తాలు కూడా గుర్తు పట్టరన్నారు. ‘‘కిషన్రెడ్డి తెలంగాణ ద్రోహి. …
Read More »మీ రియల్ అజెండా విద్వేషం.. అసలు సిద్ధాంతం విభజనే: కేటీఆర్
హైదరాబాద్లో బీజేపీ నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష అజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఆయనకు మంత్రి లేఖ రాశారు. పార్టీ డీఎన్ఏలోనే విద్వేషాన్ని నింపుకొన్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం తమ అత్యాశే అవుతుందన్నారు. మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం.. అసలు …
Read More »కన్నుల పండుగగా పూరీ జగన్నాథుడి రథయాత్ర
ఒడిశాలో ఏటా నిర్వహించే పూరీ జగన్నాథుడి రథయాత్ర నేడు(జులై 1న)అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పూరీ చేరుకున్నారు. దీంతో పూరీ వీధిలు కిక్కిరిసిపోయాయి. జై శ్రీ జగన్నాథ స్వామి అంటూ భక్తులు చేసిన స్వామివారి నామస్మరణల మధ్య రథ చక్రాలు ముందుకు కదిలాయి. కార్యక్రమానికి కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, గవర్నర్ గణేశీలాల్, సీఎం నవీన్ పట్నాయక్, సినీనటి కంగనా రనౌత్ తదితరులు …
Read More »