Home / KSR (page 147)

KSR

నిజామాబాద్ యువ‌త‌కు ఎంపీ క‌విత బంప‌ర్ ఆఫ‌ర్

నిజామాబాద్ జిల్లా యువ‌త‌కు ఎంపీ కల్వకుంట్ల కవిత బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. కేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజనం పెట్టే కార్యక్రమాన్ని  మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో నిజామాబాద్‌లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజనం పెడుతున్న నేప‌థ్యంలో  త‌మకు కూడా ఉచిత భోజన సౌకర్యం కల్పించాలని రోజు లైబ్రరీకి వచ్చే రిటైరయిన ఉద్యోగులు, పాఠకులు, పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు తనకు విజ్ఞప్తి చేశారని …

Read More »

పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన మంత్రి జూప‌ల్లి ఓఎస్డీ

ఓ సీఐ త‌న‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశాడ‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఓఎస్డీ జీ.వీరారెడ్డి ఫిర్యాదు చేశారు. వివిధ చానల్స్ లో వస్తున్న కథనాలు అవాస్త‌వ‌మ‌ని, వాటిపైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదులో వీరారెడ్డి కోరారు. త‌న‌ను బెదిరింపుల‌కు గురిచేయ‌డ‌మే కాకుండా… తిరిగి త‌న‌పైనే నిరాధారమైన ఆరోపణలు చేయటం బాధాకరమ‌ని వీరారెడ్డి  ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న కె జనార్దన్ రెడ్డి గత …

Read More »

రానున్న ఎన్నికల్లో 100 స్థానాల్లో గెలుస్తాం..మంత్రి తుమ్మల

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమనిరాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 100 స్థానాల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మళ్లీ …

Read More »

కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టు..రోజా సంచలన వాఖ్యలు

తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారని, ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా అదే చేయబోతునట్లు ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఎమ్మెల్యే రోజా తెలిపారు.ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ..బీజేపీతో వైసీపీ కుమ్మక్కయిందని, ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోనున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తి వాస్తవ విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుత అధికార పార్టీ తెలుగుదేశం …

Read More »

మంత్రి కేటీఆర్ కు ఇష్టమైన క్రికెటర్ ఎవరో తెలుసా..?

‘అన్నా ఆపదలో ఉన్నాం. సాయం చేయండి’ అని ఒక్క ట్వీట్‌ పెడితే చాలు ఎక్కడున్నా నిమిషాల్లో స్పందిస్తారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. ఆయన్ను ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకుంటారు. సోషల్‌మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే కేటీఆర్‌ తాజాగా అభిమానులతో ట్విటర్‌ చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలపై తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. డిసెంబర్‌లోగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని మీకు అనిపిస్తోందా? అందుకు సిద్ధంగా …

Read More »

కంటతడి పెట్టిన సీఎం కుమారస్వామి

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి సభావేదికపైన అందరు చూస్తుండగానే కంటతడి పెట్టారు.ఇవాళ జేడీఎస్ నేతలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అయన మాట్లాడారు.తన అన్నయ్యో, తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారు అని చెప్పారు . అయితే సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రస్తుత పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తి కి గురి చేస్తున్నాయని అన్నారు.నేను నిత్యం బాధను దిగమింగుతున్నాను. అది విషానికి తక్కువేం కాదు. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా …

Read More »

మరోసారి వార్తల్లోకి ఎక్కిన రేవంత్..!!

కాంగ్రెస్‌ నాయకుడు, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.అయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్‌ సొసైటీకి చెందిన ఏడు ఓపెన్‌ ప్లాట్లను అక్రమంగా విక్రయించినట్లు హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఇమ్మనేని రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ( 2002లో ) హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ సొసైటీలో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఏడు ఓపెన్‌ ప్లాట్లను అక్రమంగా రెసిడెన్షియల్‌ …

Read More »

రైతుబంధు ఎందుకు కేంద్రం మెచ్చిందో చెప్పిన‌ కేసీఆర్‌

రైత‌న్న‌ల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం రైతుబంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. దేశంలోనే విప్ల‌వాత్మ‌క నిర్ణ‌య‌మైన ఈ ప‌థ‌కానికి అనేక‌వ‌ర్గాల నుంచి ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఇటీవ‌లే ఆర్థిక‌శాఖ స‌ల‌హాదారు ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం కేసీఆర్ స్పందించారు. ‘‘నేలను విడిచి సాము చేయడం మంచి పద్దతి కాదు. వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలి. ప్రాధాన్యతలను గుర్తించాలి. వాటి ఆధారంగా పనిచేసుకుపోవాలి. తెలంగాణలో 65 శాతం మంది వ్యవసాయ …

Read More »

ప్ర‌పంచానికి తెలంగాణ‌ను తెలియ‌జెప్పింది కేసీఆరే..!!

ప్రపంచానికి తెలంగాణా పదాన్ని పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేన‌ని రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్‌సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. తెలంగాణా ప్రజల ఆకాంక్షలనూ ప్రపంచానికీ తెలిపింది ముఖ్యమంత్రి కేసీఆరే అని తెలిపారు. ఆంధ్రలోను కేసీఆర్ నాయకత్వన్నీ అహ్వానిస్తున్నారని, భవిష్యత్ భారతానికి తెలంగాణా నుండే నాయకత్వం వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ మండల,పట్టణ టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి …

Read More »

బేగంపేట బస్తీ ధవాఖనాను ఆకస్మిక తనిఖీ చేసిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసి నిర్వహిస్తున్న బస్తీ ధవాఖనా పనితీరును పరిశీలించేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. బేగంపేటలో ఉన్న శ్యామ్ లాల్ బిల్డింగ్ బస్తీ ధవాఖనాను మంత్రి శనివారం ఉదయం తనిఖీ చేశారు. బస్తీ ధవాఖనాలో ఉన్న వసతులను అక్కడి సిబ్బంది పనితీరును మంత్రి పరిశీలించారు. బస్తీ ధవాఖనాలో ఉన్న డాక్టర్ తోపాటు, ఆమె సహాయక సిబ్బందిని, రోజు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat