మీరు జియో వాడుతున్నారా.. మీరంతా జియో యూజర్లా.. అయితే ఇది మీకు శుభవార్త. అదే ఏమిటంటే మరో నెల పాటు వినియోగదారులు బిల్లు చెల్లించనవసరం లేదు. గత నెలలో ఐదు లక్షల మంది కస్టమర్లు జియో ఫైబర్ ని రిజిస్టర్ చేసుకున్నారు. అయితే కొత్తగా రిజిస్టర్ చేసుకునేవారితో పాటు ఇతర జియో సేవల పొందుతున్న వారందరికీ ఒకే బిల్లింగ్ సిస్టమ్ ను రూపొందించే పనిలో జియో ఉంది. ఈ ప్రక్రియలో …
Read More »‘సాహో’ నిర్మాతలపై కేసు నమోదు.. ఏమైందంటే..?
సాహో సినిమా నిర్మాతలపై బెంగుళూరుకు చెందిన ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాహో నిర్మాతలైన యూ.వీ. క్రియేషన్స్ తమ సంస్థ పేరున్న లగేజీ బ్యాగులను సినిమా సన్నివేశాలలో ప్రదర్శిస్తామని నమ్మించి దాదాపు 1 కోటి 40 లక్షల రూపాయల వరకు మోసం చేసారంటూ ఆర్క్ టిక్ ఫాక్స్ లగేజీ బ్యాగ్స్ తయారీ సంస్థ ఆరోపించింది. ఇందుకుగాను సాహో నిర్మాతలపై మాదాపూర్ పోలీస్ …
Read More »ఖిలా వరంగల్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం..!!
ఖిలా వరంగల్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్ అన్నారు. గురువారం వరంగల్నగర మాజీ డిప్యూటీ మేయర్ కట్టెసారయ్యతో కలిసి ఖిలా వరంగల్ను సందర్శించారు. శంభునిగుడి, గండం చెరువుపార్క్, కాకతీయుల నాటి ఇతర చారిత్రక కట్టడాలను ఆయన పరిశీలించారు. కుష్మహల్, కాకతీయ తోరణాల నిర్మాణశైలిని చూసి అబ్బురపడ్డారు. ఇటీవల చేపట్టిన అభివృద్ధి పై వాకబు చేశారు. ఖిలా వరంగల్లో నిర్మిస్తున్న పురావస్తు మ్యూజియం గురించి తెలుసుకున్నారు. …
Read More »ఏపీ, తెలంగాణలకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మోడీ సర్కార్ తీపికబురు అందించింది. తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 16 మంది ఐఏఎస్లను కేటాయించింది. ఏపీకి 9 మంది, తెలంగాణకు ఏడుగురు ఐఏఎస్లను కేటాయించించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిపాలన కోసం ఐఏఎస్ల కొరత ఉంది. అవసరమైనంత కంటే తక్కువ మంది ఐఏఎస్లు ఉన్నారు. దీనికి తోడు మరికొందరు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఈ …
Read More »మహారాష్ట్ర ఎన్నికలకు సహకారం అందిస్తాం..!!
మహారాష్ట్ర లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. అక్టోబర్ 21 న మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల ప్రధానకార్యదర్శులు, డిజిపిలు, సిఈఓలు, ఎక్సైజ్, ఆదాయపు పన్ను, అధికారులతో కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ ఆరోరా, ఇతర ఎన్నికల కమీషన్ అధికారులు డిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో తెలంగాణ …
Read More »రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ భేష్.. మంత్రి కేటీఆర్
భవన నిర్మాణ అనుమతుల్లో తెలంగాణ విధానం దేశంలోని అత్యుత్తమ విధానాల్లో ఒకటి అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల విషయంలో పారదర్శక విధానాలకు శ్రీకారం చుట్టామని, ఇందుకోసం మొత్తం ప్రక్రియను ఆన్ లైన్ చేస్తూ, మరింత పారదర్శకంగా ఉండే విధానాన్ని రూపకల్పన చేస్తున్నామన్నారు. ఈరోజు రియల్ ఏస్టేట్ సంఘాలు మంత్రి కేటీఆర్ ను పురపాలక కాంప్లెక్స్ లోని మంత్రి కార్యాలయంలో కలిశాయి. ఈ …
Read More »బిల్ట్ పునరుద్దరణ పనుల్లో ఆలస్యంపైన పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ఆగ్రహం
వరంగల్ జిల్లా కమలాపూర్ లోని బల్లార్ పూర్ ఇండస్ర్టీస్ (బిల్ట్) పునరుద్దరణ కార్యకలాపాలపైన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. బిల్ట్ ఛీప్ అపరేటింగ్ అఫీసర్ (సివోవో)నేహార్ అగర్వాల్, సిజియం హరిహరణ్ ఈరోజు మంత్రిని కలిసి కంపెనీ పునరుద్దరణ కోసం చేపట్టిన పనులను మంత్రికి వివరించారు. బిల్ట్ పునరుద్దరణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహించి, కంపెనీ యాజమాన్యంతో చర్చలు నిర్వహించిందని, కంపెనీ తిరిగి తెరుచుకునేందుకు కావాల్సిన …
Read More »బయో ఆసియా-2020 సదస్సును విజయవంతంగా నిర్వహిస్తాం.. కేటీఆర్
2020 ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు తెలంగాణలో ‘బయో ఆసియా-2020’ సదస్సు జరుగనున్నది. హైద్రాబద్లోని హెచ్ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపటి కోసం నేడు అనే థీమ్తో ఈ సదస్సు జరుగనుంది. ఈ రోజు దీనికి సంబంధించిన వెబ్సైట్, లోగో, థీమ్ను ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఇది 17వ బయోఆసియా సదస్సు కావడం విశేషం. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో చాలా …
Read More »సీఎం కేసీఆర్ వెంటే ఆర్టీసీ సిబ్బంది
తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉన్నారు.. కానీ యూనియన్ల సంఘాల నాయకులు మాత్రమే వారిని రెచ్చకొడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఒక ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయి. తండ్రి పాత్రలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిల్లలు అయిన ఆర్టీసీ సిబ్బందిని పిలిపించుకుని మాట్లాడాతారు అని చెప్పారు. పిల్లలు అన్నప్పుడు అలుగుతారు. వారిని తండ్రి సముదాయిస్తాడు. బుజ్జగిస్తారు. …
Read More »ఆర్టీసీ సిబ్బందికి హైకోర్టులో ఊరట
తెలంగాణ రాష్ట్రంలో గత పన్నెండు రోజులుగా సమ్మె నిర్వహిస్తోన్న ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన జీతాలను వచ్చే సోమవారం లోపు చెల్లించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ వేతనాలు సోమవారం లోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలను చెల్లింపులపై ఈ రోజు బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీసీ యాజమాన్యం …
Read More »