వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్ఎస్కు గుడ్బై చెప్పి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని మీడియాలో వార్తలు తెలిసిందే. ఈ క్రమంలో ఈ వార్తలపై ఇవాళ కొండా సురేఖ దంపతులు మీడియాతో మాట్లాడి దీనిపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారే ప్రసక్తే లేదని.. కడదాకా టీఆర్ఎస్ పార్టీ,కేసీఆర్ తోనే ఉంటానని కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. ఇటీవల టీడీపీకి టాటా చెప్పి కాంగ్రెస్ కండువా …
Read More »24గంటల నిరంతర విద్యుత్ కోసం టీ సర్కారు మరో అడుగు ..!
24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కరెంట్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా దామరచర్లలో 4 వేల మెగావాట్లతో కూడిన యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంటుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్లాంటును బీహెచ్ఈఎల్ సంస్థ రూ. 20 వేల 370 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాంటు నిర్మాణానికి మొదటి విడతగా రూ. 417 …
Read More »92 వేల మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ
శాసనసభలో కేసీఆర్ కిట్లు పథకంపై లఘు చర్చ జరిగింది. సభ్యులందరూ మాట్లాడిన తర్వాత వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వివరణ ఇచ్చారు. కేసీఆర్ కిట్లు పథకాన్ని కూడా విపక్షాలు విమర్శించడం తగదన్నారు. కేసీఆర్ కిట్.. సూపర్ హిట్ అని పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్లు పథకం అమలు వెనుక గొప్ప విజన్ ఉందని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ, హరితహారం, కేసీఆర్ కిట్లు లాంటి …
Read More »కేసీఆర్ సీఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టం..కొండా సురేఖ
నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు .శాసనసభలో కేసీఆర్ కిట్లపై లఘు చర్చ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడారు. ప్రతిష్టాత్మక పథకాలతో ప్రజల్లో సీఎం కేసీఆర్ విలువలు పెంచుతున్నారని తెలిపారు.కేసీఆర్ కిట్.. పేదల జీవితాల్లో వెలుగులు నింపే పథకమని ఈ సందర్భంగా అన్నారు . కేసీఆర్ కిట్లు ప్రజల్లో బాగా ఆదరణ పొందుతున్నాయని చెప్పారు. …
Read More »ఉత్తమ్-ఎర్రబెల్లి మధ్య అసెంబ్లీలో ఆసక్తికర సంభాషణ
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు, హుజూర్ నగర్ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇవాళ అసెంబ్లీ లాబీల్లో వీరు ఎదురుపడ్డారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిఉద్దేశించి గడ్డం ఎప్పుడు తీస్తావ్… అని ఎర్రబెల్లి అనగా 2019లో తీస్తా… అని ఉత్తమ్ అన్నారు. అంతేగాక కూల్గా ఉన్నావ్.. అని ఎర్రబెల్లితో ఉత్తమ్ అనగా నాకు టెన్షన్స్ …
Read More »నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు.. పోచారం
తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నకిలీ విత్తనాల విక్రయంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిని రాష్ట్రం నుంచి పూర్తిగా ఏరేస్తామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 50 టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలు నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఏరివేసే …
Read More »త్వరలో 600 AE పోస్టులకు నోటిఫికేషన్..
విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న 600 అసిస్టెంట్ ఇంజనీర్(AE) పోస్టులను భర్తీ చేయాలని డిస్కమ్లు నిర్ణయించాయి. తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(టీఎస్ట్రాన్స్కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్)ల్లో ఈ మేరకు పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోంది. ఈ నియామకాలన్నిటికీ ఉమ్మడిగా ఒకే నోటిఫికేషన్ జారీ కానుంది. విద్యుత్ సంస్థల వారీగా ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఐటీ విభాగాల్లో AE పోస్టుల ఖాళీలను గుర్తించి …
Read More »2018 అక్టోబర్ చివరి నాటికి అది చేసి చూపిస్తాం.. మంత్రి తుమ్మల
ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కొత్త జిల్లాల భవనాల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సమాధానం ఇచ్చారు. పది జిల్లాలు ఉన్నటువంటి రాష్ర్టాన్ని 31 జిల్లాలుగా మార్చామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు పాలన వెళ్లిందన్నారు. ఈ కొత్త సంస్కరణలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. అంతేకాకుండా అధికారులను ప్రజలు నేరుగా కలుసుకునే అవకాశం వచ్చిందన్నారు. 26 జిల్లాల్లో కొత్త భవనాలకు …
Read More »ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేస్తా౦..జగదీశ్రెడ్డి
ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సమాధానమిచ్చారు. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని ఈ సందర్భంగా తెలిపారు . ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తేల్చిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లు గతంలో ఒకటిగా ఉండేవి. వేర్వేరుగా కమిషన్లను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మేరకు …
Read More »కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు తర్వాతే ఎన్నికలు.. జూపల్లి
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారన్న జూపల్లి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తండాలు, ఆదివాసీ గూడెంలను గ్రామపంచాయతీలుగా మార్చుతున్నామని తెలిపారు. ప్రజలకు గ్రామీణ పరిపాలన విషయంలో …
Read More »