Home / KSR (page 473)

KSR

గ‌ల్ఫ్ కార్మికుల‌ను షేక్ నుంచి విముక్తి క‌లిగించిన మంత్రి కేటీఆర్‌

దేశం కాని దేశంలో ఉపాధి కోసం యజమాని నమ్మించి మోసం చేస్తే…మంత్రి కేటీఆర్‌ ఆదుకున్నాడు. కువైట్‌లో ఉపాధి కోసం వెళ్లగా…వారి యజమాని నుంచి గత తొమ్మిది నెలలుగా సమస్యలు ఎదుర్కొంటుండగా మంత్రి ఆదుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన మగ్గిడి రాజశేఖర్‌, భీంగల్‌ మండలానికి చెందిన నీలం గంగాదర్‌, ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని హనుమాన్‌ గల్లీకి చెందిన కందుల సాయికుమార్‌ ఉపాధి కోసం కువైట్‌ …

Read More »

కాంగ్రెస్ పార్టీ కావాలనే ఇలా చేసింది..

చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ పార్టీ కావాలనే తొలిరోజు సమావేశానికి అంతరాయం కలిగించిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పీ. సుధాకర్‌రెడ్డి తెలిపారు. తొలిరోజు మండలి సమావేశం వాయిదా ఆనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ పార్టీ కావాలనే తొలిరోజు సమావేశానికి అంతరాయం కల్గించిదన్నారు. ఇదంతా వారి ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగిందని వెల్లడించారు. టీఆర్‌ఎస్ విప్ బీ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సభా సమావేశాల సజావుకు పూర్తి సహకారం అందిస్తామని …

Read More »

సోనియా గాంధీకి అస్వస్థత

కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన సిమ్లా నుంచి ఢిల్లీకి చేరుకొని గంగా రామ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సోనియా గాంధీకి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Read More »

పత్తి అమ్మిన వెంటనే నేరుగా రైతుల ఖాతాలోకి చెల్లింపులు..

పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ లను మార్కెటింగ్ మంత్రి హరిశ్ రావు ఆదేశించారు.ఇకపై ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు.తెలంగాణలో 200 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాలు రైతులకు సమీపంలో ఉండే విధంగా వికేంద్రీకరించాలని హరీశ్ రావుకోరారు.పత్తి,ధాన్యం,మొక్క జొన్న, సోయాబీన్ తదితర పంటల దిగుబడి, మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న ధర …

Read More »

దివ్యాంగుల సంక్షేమానికి రూ.33 కోట్లు..మంత్రి తుమ్మల

దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్‌కు అదనంగా రూ.33 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు . 2017–18 ఆర్థిక సంవత్సరంలో వికలాంగుల కోసం రూ.37 కోట్లు కేటాయించినట్లు అయన  పేర్కొన్నారు.ఈ రోజు సచివాలయంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖల అధికారులతో మంత్రి తుమ్మల సమావేశం నిర్వహించారు. దివ్యాంగుల కోసం రూ.7 కోట్లతో …

Read More »

రూ.800 కోట్లతో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ..కేటీఆర్

మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మేథా సర్వో డ్రైవ్స్ సంస్థ ఎంవోయూ కుదుర్చుకున్నది.ఈ సమావేశానికి రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ  మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు.రూ. 600 కోట్లతో సంగారెడ్డి ద‌గ్గ‌ర్లోని కొండకల్‌లో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల 2 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష …

Read More »

బ్రేకింగ్ న్యూస్..తెలంగాణ తెలుగు తమ్ముళ్ళకు చంద్రబాబు షాక్..!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ టీడీపీ నేతలతో అయన సమావేశం అయ్యారు.అనంతరం అయన మాట్లాడుతూ…ఏ పార్టీలోనైన సంక్షోభం రావడం, సమసిపోవడం చాలా సర్వసాధారణమని అన్నారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మొదటగా పెద్దవిగా కనిపిస్తాయనితరువాత చిన్నవైపోతాయని అన్నారు . తన హయాంలో పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొందని, అన్నింటి నుంచి బయటపడి తలెత్తుకు నిలిచామని అన్నారు.తెలుగుదేశం …

Read More »

ఒకేసారి భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ధర శుక్రవారం భారీగా తగ్గింది .  అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక వ్యాపారుల దగ్గర నుంచి కొనుగోళ్లు తగ్గడంతో బంగారం  ధర తగ్గినట్లు బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు వెల్లడించాయి. రూ.275 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర  రూ.30,275గా పలికింది.మరోవైపు  వెండి ధర కుడా తగ్గింది .525 తగ్గడంతో వెండి ధర రూ.40వేల మార్కు దిగువకు చేరింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.39,925గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల …

Read More »

కాంగ్రెస్‌ నేతలు తలపెట్టిన ఛలో అసెంబ్లీ భగ్నం

రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తలపెట్టిన ఛలో అసెంబ్లీని తెలంగాణ పోలీసులు శుక్రవారం భగ్నం చేశారు. పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.చలో అసెంబ్లీకి అనుమతి లేదని నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజే ఈ ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దానికి కాంగ్రెసే బాధ్యత వహించాలని హెచ్చరించింది.హైదరాబాదు నగర శివారుల్లో పెద్ద సంఖ్యలో …

Read More »

ఎన్ని రోజులైనా మాట్లాడేందుకు మేం సిద్ధం.. మంత్రి హరీష్‌

ఏ అంశమైనా..ఎంత సేపైనా..ఎన్నిరోజులైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి హరీష్ రావు  స్పష్టం చేశారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో.. కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేయడం సరికాదన్నారు.  అందరు సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రి హరీష్  తెలిపారు.కాంగ్రెస్ నేతలు చర్చ కంటే.. రచ్చకే సిద్ధంగా ఉన్నారని ఇవాళ మరోసారి రుజువైందని ఈ సందర్భంగా మంత్రి  పేర్కొన్నారు. సభ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీదే కాదన్నారు. సభలో ఎన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat