Home / KSR (page 478)

KSR

స్వరాష్ట్రానికి తిరిగి వస్తామంటున్నసూరత్ నేతన్నలు..!

– పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుని కలిసిన సూరత్ నేతన్నలు – తెలంగాణకి తిరిగి రావాలన్న ముఖ్యమంత్రి పిలుపుకి, పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కృతజ్ఞతలు తెలిపిన నేతన్నలు – తెలంగాణలో టెక్స్టైల్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే వారందరికీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ   ఇతర రాష్ట్రాలకు పొట్టచేత పట్టుకుపోయిన నేతన్నలు తిరిగి రాష్ట్రానికి వస్తామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ …

Read More »

27న అసెంబ్లీ ముట్టడి..ఉత్తమ్

ఈ నెల 27న గాంధీ భవన్  నుంచి పాదయాత్రగా  వెళ్లి అసెంబ్లీని  ముట్టడిస్తామన్నారు  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీ భవన్ లో  సమావేశమైన  కిసాన్ సెల్… ఏకగ్రీవ  తీర్మానాలు ప్రకటించింది.  రైతులకు రెండు లక్షల  రుణమాఫీ  ఏకకాలంలో ఇవ్వాలని  నిర్ణయించామన్నారు  . పత్తి క్వింటాలుకు 5వేలు  తగ్గుకుండా చూస్తామన్నారు.  నష్టపోయిన మొక్కజొన్న,  వరి పంటలకు… ఎకరాకు 15 వేలు, పత్తికి 25 వేల  నష్టపరిహారం చెల్లించాలని ఉత్తమ్ కుమార్ …

Read More »

ఆధార్ లింక్ తుది గడువు పొడిగింపు

ప్రభుత్వ సేవలు పొందడానికి ఆధార్ కచ్చితమా లేదా అనే అంశంపై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. దీనిపై పలు స్వచ్ఛంద సంస్థలు పిటిషన్లు వేశాయి. వాదనలు విన్న సుప్రీం కోర్టు.. అక్టోబర్ 30కి వాయిదా వేసింది. అయితే ఆధార్ తప్పనిసరి చివరి తేదీని వచ్చే ఏడాది మార్చి 31కి పొడిగించినట్టు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది కేంద్రం. గతంలో ఇది 2017 డిసెంబర్ 31 వరకు ఉండేది. ఈ పొడిగింపు కేవలం …

Read More »

రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంచలన నిర్ణయం!

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన టెలీకం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్ చివరినాటికి 2జీ మొబైల్ వ్యాపారానికి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించింది. అయితే 3జీ, 4జీ సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది. కంపెనీ కార్యకలాపాలను కుదిస్తున్నందున పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కంపెనీని వీడివెళ్లాలని కోరినట్టు సమాచారం. అయితే దీనిపై ఆర్‌కామ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నెల మొదట్లో ఎయిర్‌సెల్‌తో విలీన ఒప్పందం కుదుర్చుకున్న …

Read More »

కేసీఆర్ డైనమిక్ లీడర్..కేంద్రమంత్రి ఆహ్లువాలియా

సీఎం కేసీఆర్ డైనమిక్ లీడర్ అని కేంద్రమంత్రి ఆహ్లువాలియా కొనియాడారు.రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో మిషన్ భగీరథపై ప్రభుత్వ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆహ్లువాలియాకు మిషన్ భగీరథపై ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆహ్లువాలియా మాట్లాడుతూ.. ఇంటింటికి మంచినీరు సరఫరా చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ  నిలుస్తుందన్నారు. తెలంగాణ ఎంపీలు మిషన్ భగీరథ గురించి కేంద్రమంత్రులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిపారు. ప్రతీ ఒక్కరికి మంచి నీరు అందించాలన్న …

Read More »

రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీ.టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇరువురు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకూ వెళ్లింది. టీడీఎల్పీ సమావేశం నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ఓవైపు సన్నాహాలు చేస్తుంటే…మరోవైపు ఎల్‌.రమణ మాత్రం పార్టీతో పాటు టీడీపీఎల్పీ కార్యక్రమాలేవీ నిర్వహించవద్దని రేవంత్‌కు ఆదేశాలు జారీ చేశారు.దీనిపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ ’ టీడీఎల్పీ నేతను నేనే. సమావేశం నిర్వహించే హక్కు …

Read More »

ఆదినారాయణరెడ్డి పై జోగి రమేష్‌ ఫైర్..!

ఆంద్రప్రదేశ్  మంత్రులు నారా లోకేశ్‌, ఆదినారాయణరెడ్డి, ప‍్రత్తిపాటి పుల్లారావులపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌  పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు . వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రపై మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌  పార్టీ కార్యాలయంలో  జోగి రమేష్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఆదినారాయణరెడ్డి  తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ప్రబుద్ధుడు. ఆదినారాయణరెడ్డి నువ్వెప్పుడు రాజీనామా చేశావు. …

Read More »

శ్రీశైలంలో రేవంత్ రెడ్డి-ఎందుకంటే..?

తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి  శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్నికుటుంబ సమేతంగా మంగళవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం అధికారులు ప్రధాన రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన  తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More »

లండన్ నుండి రేవంత్ కు బిగ్ షాక్ ఇచ్చిన చంద్రబాబు..!

తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ని  తక్షణమే  టీడీపీ పార్టీ నుంచి బహిష్కరించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ రాసిన లేఖపై  టీడీపీ పార్టీ జాతీయ అద్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఆయన, ఎల్ రమణకు ఫోన్ చేసి మాట్లాడారు. తాను తిరిగి వచ్చేంత వరకూ టీఎస్ టీడీపీఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్ …

Read More »

టీఆర్‌ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు..మంత్రి తుమ్మల

టీఆర్‌ఎస్ పాలనలో రైతులు సంతోషంగా  ఉన్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. రైతుల కోసమే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే చేపడుతున్నట్లు మంత్రి  స్పష్టం చేశారు. భూరికార్డుల ప్రక్షాళన సజావుగా సాగుతుందని తుమ్మల తెలిపారు. ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ యుద్ధప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు.రైతుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ సర్కార్ కృషి చేస్తోందని.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat