Home / KSR (page 500)

KSR

మహబూబాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం… ఎంపీ కవిత

తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ మానుకోట‌ జిల్లాను  అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని నిజామాబాద్  ఎంపీ కవిత అన్నారు. నిన్న  సింగరేణి ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఈ రోజు  మహబూబాబాద్‌కు వచ్చిన ఎంపీ  కవిత ఈసందర్భంగా మీడియాతో మాట్లాడారు. “కొత్తగూడెంలో సింగరేణి ప్రచారం ఘనంగా ముగిసింది. గ్రామాలను అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం. తెలంగాణలో నిరంతరం విద్యుత్ ఇచ్చి …

Read More »

తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేసిన మంత్రి హరీష్

తపాస్‌పల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ ద్వారా సిద్ధిపేట, కొండపాక మండలాల్లోని 20 గ్రామాలకు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. గోదావరి నీళ్లు మొట్టమొదటి సారి సిద్ధిపేట జిల్లాకు తెచ్చామని తెలిపారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు అని చెప్పారు. ఉమ్మడి మెదక్ …

Read More »

సమ్మక్క, సారలమ్మ జాతరకు 80 కోట్లు…!

 సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసినందున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి చందూలాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఆసియా ఖండంలో …

Read More »

కేంద్ర మంత్రికి మంత్రి హరీశ్‌రావు లేఖ

తెలంగాణ రాష్ట్ర౦లో ప్రధాన పంటలో ఒకటిగా ఉన్న సోయాబీన్‌ కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను రాష్ట్ర మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌రావు కోరారు. తెలంగాణలో సోయాబీన్‌ పంట ఎక్కువగా ఉత్పత్తి అయిన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి కేంద్ర సంస్థలతో పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి టి.హరీశ్‌రావు ఈ మేరకు కేంద్ర మంత్రికి  లేఖ రాశారు. ‘తెలంగాణలో 1.64 లక్షల హెక్టార్లలో సోయాబీన్‌ సాగు …

Read More »

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు..!

 రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు దక్కించుకున్న ఈ ప్రాజెక్టుకు తాజాగా అటవీ శాఖ సైతం అనుమతులు ఇచ్చింది. కాళేశ్వరం పథకానికి అటవీ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని అటవీ అడ్వయిజరీ కమిటీ(ఎఫ్‌ఏసీ) ఈ మేరకు నిర్ణయం చేసింది. అటవీ అనుమతులకు సూత్రప్రాయ ఆమోదం తెలుపుతూ మంగళవారం మినిట్స్‌ జారీ చేసింది. …

Read More »

భగవద్గీతను ఎందుకు చదవాలి..?

బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అంటారు. నిజమే! తలరాతను ఎవరూ మార్చుకోలేకపోవచ్చు. కానీ, గీతను చదివితే మాత్రం జీవనరేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోను, మనిషి జీవితంలోను గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే. భగవద్గీత అనగా భగవంతునిచే గానం చేయబదినదని అర్థం. అంతే భగవంతుని చేత చెప్పబడింది. …

Read More »

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఫోటో…!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు ఆంధ్రాలో ఎంత క్రేజ్ ఉందో మనందరి తెలిసిన విషయమే . గతంలో  తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు గానీ ఇటీవలే పరిటాల అనంత్ శ్రీరామ్ వివాహ వేడుకకు హాజరైనప్పుడు గానీ అక్కడి ప్రజలు సీఎం కేసీఆర్ కు  ఎలా నీరాజనాలు పట్టారో చూశాం.  కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను అక్కడి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్‌లు కట్‌చేసి ఘనంగా జరుపుతున్న విషయం సైతం తెలిసిందే. …

Read More »

యువ నటుడు మృతి…

కన్నడ యువ నటుడు, ‘పప్పుసీ కామెడీ’  ఫేం రాకేశ్‌(27) మంగళవారం మృతి చెందారు. కన్నడ సినిమా పరిశ్రమలో ‘బుల్లీ’గా సుపరిచితుడైన ఆయన కోరమంగలలో ఉన్న సెయింట్‌జాన్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గ్యాంగ్రిన్‌ వ్యాధితో బాధపడుతున్న రాకేశ్‌ రెండు నెలలక్రితం శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. మరోసారి వ్యాధి తిరగబెట్టడంతో ఆయన సెయింట్‌జాన్స్‌ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు.

Read More »

రాహుల్ పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తి…!

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈనెల 25ను ముహూర్తంగా నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు, ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈనెల 10 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాహుల్ గాంధీనే అధ్యక్షుడిగా నిర్ణయించినట్టు చెప్పడంతో పీసీసీ, …

Read More »

నేడు మంత్రి కేటీఆర్ అధ్యక్షతన హెచ్‌ఎండీఏ బోర్డు సమావేశం

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా హెచ్‌ఎండీఏ రూపొందించిన ప్రణాళికలు ఆచరణ దిశగా నేడు అడుగులు పడనున్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధ్యక్షతన బుధవారం బేగంపేటలోని మెట్రోరైల్ భవన్‌లో హెచ్‌ఎండీఏ ఏడవ బోర్డు సమావేశం జరగనుంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో దాదాపు 30కి పైగా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat