తన ఫిలిం స్టూడియో కి ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ని డైరెక్టర్ యన్. శంకర్ కలిశారు. బేగంపేట ప్రగతి భవన్ లో ఆయన కేటీఆర్ ని కలిసారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కేటిఆర్ తన ఫిలిం స్టూడియో స్థలానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించారని ఈ మేరకు ఆయనను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు ఎన్.శంకర్ …
Read More »కాంగ్రెస్కు కోమటిరెడ్డి గుడ్బై…ఇదొక్కటే పెండింగ్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలడం ఖాయమైంది. మునుగోడు శాసనసభ స్థానం నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. బీజేపీలో చేరికపై గత కొంతకాలంగా తీవ్రమైన చర్చ సాగుతుండగా….తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసిన రాజగోపాల్ రెడ్డి ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల …
Read More »చిన్నారిపై ఆత్యాచారానికి హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్టు
గత రాత్రి 9నెలల చిన్నారి శ్రీహితపై ఆత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితుడు శాయంపేట మండలం వసంతపూర్ గ్రామానికి చెందిన పోలేపాక ప్రవీణ్ను బుధవారం హన్మకోండ పొలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ. శాయంపేట ప్రాంతానికి చెందిన నిందితుడు గత కోద్ది కాలంగా హన్మకోండ ప్రాంతంలో ఓ హోటల్లో క్లీనర్గా పనిచేసే వాడు. ఈ క్రమంలో నిందితుడు గత రాత్రి అనగా …
Read More »గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ
గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 21న జరిగే తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులపైనా గవర్నర్తో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్లో ఈ సాయంత్రం పార్టీ కార్యవర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్తో …
Read More »తెలంగాణ సీడ్ బౌల్ కావాలన్నది కేసీఆర్ ఆకాంక్ష..!!
ఆసియాలో ప్రథమంగా తెలంగాణలో జరగనున్న 32వ ఇస్టా కాంగ్రెస్ సదస్సుతో తెలంగాణ విత్తనరంగం మరింత బలోపేతం కావాలని, అత్యంత నాణ్యమయిన విత్తనాలను రైతులకు అందించేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న విత్తన పరిశోధనలు ఉపయోగపడుతున్నాయని, దానికి ఇస్టా సదస్సు మరింత దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. ఈ నెల 26 నుండి జులై 3 వరకు ప్రతిష్టాత్మకంగా జరగనున్న 32వ అంతర్జాతీయ …
Read More »విద్యార్థులకు పాకెట్ మనీ…తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం
విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ఇదే ఒరవడిలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలోని ఎస్సీ కళాశాల హాస్టళ్లలో ఉండి చదువుకొనే విద్యార్థుల వ్యక్తిగత ఖర్చులకోసం ప్రతినెలా పాకెట్ మనీ కింద రూ.500 అందించనుంది. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ వివరాలను వెల్లడించారు. వచ్చేనెల నుంచి దీనిని అమలుచేయనున్నట్టు ప్రకటించారు. పోస్ట్మెట్రిక్ చదివే విద్యార్థులుండే హాస్టళ్ల నిర్వహణా …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు వద్దు..కేసీఆర్కు సన్మానం చేస్తా..జగ్గారెడ్డి సంచలనం
తెలంగాణ తాగు, సాగు నీటి చరిత్రను తిరగరాసే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల అసంబద్ద విమర్శలు కొనసాగుతున్న తరుణంలోనే… ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతలకు షాకిచ్చేలా మాట్లాడారు. కాళేశ్వరం నిర్మాణం తప్పు పట్టాల్సిన అవసరం లేదని జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రారంభాన్ని తాను స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు. …
Read More »పీఆర్సీపై త్వరలోనే సమావేశం.. సీఎం కేసీఆర్
మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చాం. పీఆర్సీ, పదవివిరమణ వయసుపై ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం. నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించాం. పంచాయతీరాజ్ వ్యవస్థను క్రియాశీలం చేయాలని నిర్ణయించాం. పంచాయతీరాజ్ వ్యవస్థకు అధికారాల అప్పగింతను పరిశీలిస్తాం. …
Read More »తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!
తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ అంగుళానికి నీళ్లు ఇస్తామన్నారు. భవిష్యత్ లో 5వేల టీఎంసీల నీటిని ఏపీ, తెలంగాణలోని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నామని.. ఏపీలోని అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని కేసీఆర్ చెప్పారు. See Also : …
Read More »వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నా ఆత్మ..!!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నా ఆత్మ అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆసక్తికర వాఖ్యలు చేశారు. విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ స్వీకార మహోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి పై స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆసక్తికర వాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు పంచ …
Read More »