Home / rameshbabu (page 1023)

rameshbabu

కామారెడ్డిలో 12కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 12కు చేరింది. తాజాగా వచ్చిన 22 మంది రిపోర్టుల్లో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు బాన్సువాడలోనే 11 కేసులు నమోదు అయ్యాయి. కామారెడ్డి పరిధిలోని దేవునిపల్లిలో ఒక కేసు నమోదు అయ్యింది. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలను అధికారులు మరింత అప్రమత్తం చేస్తున్నారు.

Read More »

ప్రజలు, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి

కరోనా వైరస్‌ మహమ్మారి ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా ప్రపం చం, దేశం, తెలంగాణలోనూ వ్యాప్తి చెందుతున్నదని, ప్రజలు ఇంతకుముందుకంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తిచేశారు. అప్రమత్తతే కొవిడ్‌ కట్టడికి ఆయుధమని పేర్కొన్నారు. కొవిడ్‌ వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్‌ సోకినవారికి అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్న సాయం, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

Read More »

కరోనా వేళ ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు

తెలంగాణలో కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా.. గంటకొట్టినట్టే అంగన్‌వాడీల ద్వారా గర్భిణుల ఇంటి కి ఠంచన్‌గా పౌష్టికాహారం చేరుతున్నది.. గర్భిణుల ఆరోగ్య స్థితిపై ఏఎన్‌ఎంలు ఎప్పటికప్పుడు వాకబుచేస్తూ సూచనలిస్తున్నారు.. ఆపత్కాలం లో అమ్మఒడి వాహనాలు గడప ముందుకొస్తున్నాయి. కరోనా వేళ ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యులపై మరింత నమ్మకం ఏర్పడింది.. ఫలితంగా ఏప్రిల్‌, మే నెలల్లో వందశాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతాయని వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ అంచనా వేస్తున్నది. …

Read More »

24గంటలు అందుబాటులో ఉంటా

తాను 24×7 అందుబాటులో ఉంటానని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఎవరైనా, ఎప్పుడైనా తనకు ఫోన్‌ చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. అందరు కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలమని పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో కొవిడ్‌-19 పరిస్థితులు, మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ పొడిగింపుపై అభిప్రాయాలే లక్ష్యంగా నేడు ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలుత కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలో …

Read More »

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ కనగ రాజు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) గా జస్టిస్‌ కనగ రాజు నియమితులయ్యారు. జస్టిస్‌ కనగరాజు మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చింది. దీంతో ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీ కాలం ముగిసింది.

Read More »

కరోనా వ్యాప్తి నిరోధానికి ఇదే స్ఫూర్తి కొనసాగాలి

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. వైరస్‌ సోకినవారికి చికిత్స అందించడంతోపాటు వారితో కలిసినవారిని గుర్తించి, క్వారంటైన్‌ చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరికోతలు, ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా కొనసాగించాలని సూచించారు. కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలు, వ్యవసాయ …

Read More »

లక్ష దాటిన కరోనా మృతులు

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,02,696కు చేరింది. కరోనాతో అత్యధికంగా అమెరికాలో 18 వేల మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 17 లక్షల మందికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది. ఈ వైరస్‌ నుంచి ఇప్పటి వరకు 3.69 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. అమెరికాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య …

Read More »

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లఘించిన బీజేపీ ఎమ్మెల్యే

కరోనా వైరస్‌ నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. కానీ లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రజాప్రతినిధులే ఉల్లంఘిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే తప్పటడుగు వేస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే.. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తుముకూరు జిల్లాలోని టురువేకెరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎం జయరాం లాక్‌డౌన్‌ …

Read More »

239కి చేరిన కరోనా మృతుల సంఖ్య

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దేశం నలుమూలలకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందింది. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 239 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 7447 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా నుంచి 643 మంది కోలుకున్నారు. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1574కు చేరింది. ఢిల్లీలో 14 మంది, మధ్యప్రదేశ్‌లో 36, …

Read More »

ఏడాదికి 10 రోజులు ప్రపంచమంతా లాక్‌డౌన్‌ చేద్దాం

ప్రపంచంలో అనేకదేశాల్లో ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో వాతావరణ కాలుష్యం, భూతాపంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రపంచమంతా ఒప్పుకొంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏడాదికి కనీసం పదిరోజులపాటు పరిమితస్థాయిలో లాక్‌డౌన్‌ ప్రకటిస్తే బాగుంటుందని వినూత్న ప్రతిపాదన చేశారు. కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కొనసాగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, అయితే దీనిపై సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. కరోనా మహమ్మారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat