కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు సిల్వర్ లీఫ్ విల్లాస్ లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారు, కమిషనర్ శ్రీహరి గారు మరియు కౌన్సిలర్ పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్ గారితో కలిసి పర్యటించారు. ఈ మేరకు భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీటి నాలా, సీసీ రోడ్ల సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. …
Read More »జనాన్ని దోచి.. కుబేరులకు పంచి!
అచ్చే దిన్, మోదీ హైతో ముమ్కీన్ హై అంటూ అధికారానికి వచ్చిన తరువాత మోదీ నిజంగానే పేదల కోసం పాటుపడ్డారా? లేక బడా వ్యాపారస్థుల కోసం పనిచేస్తున్నారా? అనే సందేహాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి.ఎన్నికల ముందు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అధికారానికి రావడానికి బీజేపీ పాలకులు అలవాటుపడ్డారు. కానీ, ప్రజల సంక్షేమం కోసం కృషి చేసి ఓట్లడిగే పరిస్థితి ఎప్పుడూ లేదు. వాస్తవానికి మోదీ రెండు పర్యాయాల పరిపాలనలో …
Read More »బిజినెస్, బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం-సత్య నాదెళ్లను కలిసిన మంత్రి కేటీఆర్
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. ఇద్దరు హైదరాబాదీలు కలవడం శుభదినం అవుతుందని మంత్రి కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. సత్య నాదెళ్లతో బిజినెస్, బిర్యానీ గురించి చర్చించినట్లు కూడా మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇండియా టూర్లో ఉన్నారు. రెండు రోజుల …
Read More »హుజూర్నగర్లో ఈఎస్ఐ దవాఖాన ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హుజూర్నగర్ చేరుకున్న కేటీఆర్కు మంత్రి జగదీశ్రెడ్డి స్వాగతం పలికారు. హుజూర్నగర్ మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈఎస్ఐ దవాఖానను, ఎస్టీవో కార్యాలయం, బస్తీ దవాఖాన, ఎమ్మెల్యే క్యాపు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కేతవారిగూడెం నుంచి మునగాలకు నిర్మించే రోడ్డును, నేరేడుచర్ల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హుజూర్నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ …
Read More »జగద్గిరిగుట్ట పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్టకు చెందిన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు తన నివాసం వద్ద సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, బేతి గోపాల్, జనార్ధన్, హరినారాయణ, జల్దా లక్ష్మీనాథ్, తుమ్మ నవీన్, బాలాజీ, ప్రభాకర్, జైరాములు, సాయిలు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Read More »మంత్రి జగదీష్ రెడ్డి చేసిన పనికి అందరూ ఫిదా..?
నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యాంగుడికి హామీ ఇచ్చి అమలు చేసి అండగా నిలిచి ఆ కుటుంబానికి ఆపద్బాంధవుడు అయ్యాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన షేక్ నజీర్ పాషా జ్యూస్ బండి నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. నజీర్ పాషా కు షుగర్ వ్యాధి రావడంతో తన రెండు కాళ్లు తీసివేయడం జరిగింది. నిమ్స్ లో ఆపరేషన్ సమయంలో ప్లాస్టిక్ …
Read More »తెలంగాణలోని ప్రతి పల్లె ముఖరా కె కావాలి
తెలంగాణలోని ప్రతి పల్లె ముఖరా కె కావాలని, ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకుని, స్వయం సమృది బాటలో తెలంగాణ పల్లెలు పయనించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామంలో సేకరించిన చెత్త తో తయారు చేసిన వర్మికంపోస్టుతో వచ్చిన అదాయం నుంచి లక్ష రుపాయలను ముఖ్యమంత్రి సహాయనిదికి ఇవ్వడం అద్భుతమని సీఎం అన్నారు. సోమవారం సీఎం ను కలిసిన ముక్రాకె గ్రామ సర్పంచ్, గ్రామస్తులు సీఎం సహాయ …
Read More »ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సారి కూడా సమావేశాలు రెండు విడుతల్లో జరుగుతాయని పేర్కొన్నాయి. సమావేశాలు జనవరి 31న ప్రారంభమై, ఏప్రిల్6న ముగియనున్నాయి. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ 2023-24ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు సమర్పించనున్నారు. అంతకు ముందు రోజు అంటే 31న …
Read More »దేశంలో కొత్తగా 134 మందికి కరోనా
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 1,51,186 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 134 మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,78,956కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,582 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 …
Read More »ఒడిశాలో మరో రష్యా వ్యక్తి మృతి
ఒడిశాలో మరో రష్యా వ్యక్తి శవమై తేలాడు. గత 15 రోజుల్లో ఆ దేశానికి చెందిన మూడో వ్యక్తి ఒడిశాలో మరణించాడు. అతన్ని మిల్యకోవ్ సెర్గీగా గుర్తించారు. జగత్సింగ్పుర్ జిల్లాలోని పారాదీప్ పోర్టు వద్ద ఉన్న ఓ షిప్లో అతన్ని మృతదేహాన్ని పసికట్టారు. బంగ్లాదేశ్లోని చిట్టాగాంగ్ నుంచి పారాదీప్ మీదుగా ఆ నౌక ముంబై వెళ్తోంది. ఆ షిప్లో సెర్గీ చీఫ్ ఇంజినీర్గా ఉన్నారు.ఇవాళ ఉదయం 4.30 నిమిషాలకు షిప్లోని …
Read More »