రాజస్థాన్ జోధ్ పూర్ కు చెందిన రేఖ అనే బాలికకు ఏడాది వయసులోనే ఓ బాలుడికిచ్చి 20 ఏళ్ల కిందట బాల్యవివాహం చేశారు. తాజాగా కాపురానికి రావాలని అత్తింటివారు ఒత్తిడిచేశారు. తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లిని ఒప్పుకోనని రేఖ చెప్పడంతో కుల పెద్దలు రూ.10 లక్షలు జరిమానా విధించారు. దీంతో ఆమె ఓ ట్రస్టు సాయంతో ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. విచారించిన కోర్టు.. ఆ పెళ్లిని రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది.
Read More »ఎలిజబెత్ తాగిన టీ బ్యాగ్ ఎంతనో తెలుసా..?
బ్రిటన్ రాణీ ఎలిజబెత్ II మరణంతో.. ఆమె వాడిన టీబ్యాగ్ ను Ebay అమ్మకానికి పెట్టింది. 1998లో ఎలిజబెత్ ఈ టీ బ్యాగ్ ను వినియోగించారు.. దానిని దాదాపు 12వేల డాలర్లకు Ebay అమ్ముతోంది. అంటే దాదాపు రూ.9.5 లక్షలకు కొనుగోలు చేయొచ్చు. ఈ టీ బ్యాగ్ మార్కెట్లో రూ. 5కు దొరుకుతుంది ..కానీ రాణి యూజ్ చేసినందున రూ.9.5లక్షలకు అమ్ముతున్నారు. ఎలిజబెత్ II మరణంతో ప్రపంచ దేశాల ప్రముఖులు …
Read More »తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ గా తరుణ్ చుగ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి ఇంఛార్జ్, కో ఇంఛార్జ్ లు నియమితులయ్యారు. తరుణ్ చుగ్ ఇంఛార్జ్, అరవింద్ మీనన్ కో ఇంఛార్జ్ గా నియమిస్తూ బీజేపీ జాతీయ అధిష్టానం ప్రకటన జారీ చేసింది. మొత్తం 15 రాష్ట్రాలకు ఇంఛార్జ్, కో ఇంఛార్జ్లను నియమించింది. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్ ను హర్యానా ఇంఛార్జ్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని పంజాబ్ ఇంఛార్జ్ నియమించింది. పశ్చిమబెంగాల్ కు బీహార్ …
Read More »అమలపాల్ కు రెండో పెళ్లైందా..?
సరిగ్గా ఎనిమిదేండ్ల కిందట అంటే 2014లో తమిళ దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకుని, విడిపోయిన హీరోయిన్ అమలాపాల్ రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పంజాబీ సింగర్ భవి నిందర్ సింగ్ తనను వేధిస్తున్నాడని అమలాపాల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 2017లోనే అమలతో సింగ్ కు పెళ్లి జరిగిందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు ఆధారాలు సమర్పించారు. దీంతో అమల రెండో పెళ్లి నిజమేనని …
Read More »మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే..?
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గుభాళించేది గులాబీ జెండాయేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని చెప్పారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలం కొండూరు గ్రామ ఉప సర్పంచ్ పాలకుర్ల జంగయ్య గౌడ్, వార్డు సభ్యులు జహంగీర్, పగడాల రాములు, రాంబాబు, ఉడుగు శ్రీను శనివారం ఉదయం …
Read More »తెలంగాణ యువతకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్శాఖకు ఆర్థికశాఖ ఇటీవల 529 పోస్టులను మంజూరుచేసిన నేపథ్యంలో ఆయా పోస్టులను వివిధ జిల్లాలకు విభజిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పరిషత్తు (జెడ్పీ), జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో (డీపీవో) వివిధ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జెడ్పీ సూపరిటెండెంట్ పోస్టులు 103, జెడ్పీ సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 151, జెడ్పీ జూనియర్ …
Read More »సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సెటైర్లు
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వ తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది. సెప్టెంబర్ 17న తాము చేసే కార్యక్రమాలను ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంచడానికి ఏకంగా ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. దీని కో సం ఏకంగా టెండర్లనే పిలిచింది కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ. ప్రపంచంలోని ఏ దేశ ప్రభుత్వం కూడా ట్విట్టర్లో ట్రెండింగ్ కోసం టెండర్లు పిలిచిన దాఖలాలు లేవు. ఒక్క మన కేంద్ర …
Read More »కుల వృత్తుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి
తెలంగాణ రాష్ట్రంలోని కుల వృత్తుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మత్స్యకారుల సంక్షేమానికి రూ. 500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి చేయూతనిస్తున్నామని స్పష్టం చేశారు. రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్లో 9 లక్షల 12 వేల చేపపిల్లలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ కలిసి విడుదల చేశారు. ఈ …
Read More »పోరాడటం తెలుసు..కొట్లాడటం తెలుసు..
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. తాము తెలంగాణ వాళ్లమని, ఎలా పోరాడాలో తమకు తెలుసునని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. బల్క్ డ్రగ్ పార్కును రాష్ట్రానికి కేటాయించకపోవడంపై కేంద్రాన్ని విమర్శిస్తూ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఇటీవల చేసిన ట్వీట్కు కేటీఆర్ శుక్రవారం స్పందించారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపెట్టినా.. తమ విజయాలను, స్ఫూర్తిని మాత్రం అడ్డుకోలేదన్నారు. రాష్ట్రానికి …
Read More »మరోసారి బాలాపూర్ లడ్డూకి రికార్డు స్థాయి ధర
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్చేస్తూ వేలపాటలో రూ.24.60 లక్షలకు బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుడైన వంగేటి లక్ష్మారెడ్డి గణనాథుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇది గతేడాదికంటే రూ.5 లక్షల 70 వేలు అధికం కావడం విశేషం. 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట నిర్వహించలేదు. 2019లో రూ.17.6 లక్షలకు కొలను రాంరెడ్డి సొంతం …
Read More »