భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. యూయూ లలిత్తో ప్రమాణం చేయించనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరుగనున్న ఈ కార్యక్రమాని ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా, జస్టియ్ యూయూ లలిత్ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుంది.
Read More »కాజల్ ఆకాశానికెత్తుతున్న అభిమానులు.. ఎందుకంటే..?
ఇటీవల పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది చందమామ.. హటెస్ట్ బ్యూటీ ..సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. అప్పుడెప్పుడో పెళ్లికి ముందు సైన్ చేసిన సినిమాలను మాత్రమే ఇప్పుడు పూర్తి చేస్తుంది. ఇలాంటి సమయంలో ఆమె ఓ సినిమాకు సోషల్మీడియాలో ఆల్ ది బెస్ట్ చెప్పింది. అది చూసిన తర్వాత అభిమానులు కాజల్ మంచితనాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. దీనికి కారణం తనను తప్పించిన సినిమాకు ఆమె ఆల్ …
Read More »దేశంలో కొత్తగా 9,520 మందికి కరోనా
గత కొన్ని రోజులుగా దేశంలో రోజువారీ కరోనా పాజీటివ్ కేసుల నమోదు సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన గత 24 గంటల్లో కొత్తగా 9,520 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కు చేరాయి. ఇందులో 4,37,83,788 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,597 మంది మరణించారు. మరో 87,311 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం …
Read More »గణేష్ వేడుకల ఏర్పాట్లపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే Kp సమీక్ష…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జిహెచ్ఎంసి ఎనిమిది డివిజన్లలో గణేష్ వేడుకల ఏర్పాట్లపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగా పండుగను జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 31వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 9 వరకు కొనసాగే గణేష్ వేడుకల్లో భాగంగా నిమజ్జనం జరిగే …
Read More »భౌరంపేట్ ముదిరాజ్ భవనంకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే Kp కు వినతి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని భౌరంపేట్ కు చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని చింతల్ లోని కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గారు భవన నిర్మాణానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుదర్శన్ …
Read More »ఐఏఎస్లకు కేస్స్టడీగా మారిన రాజన్న సిరిసిల్ల: మంత్రి కేటీఆర్
ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న రాజన్న సిరిసిల్ల.. ఇప్పుడు ఐఏఎస్లకు కేస్ స్టడీగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. చెరువులు బాగుచేసుకోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లా పరిస్థితి సుభిక్షితంగా మారిందన్నారు. జిల్లాలో భూగర్భ నీటిమట్టం ఆరు మీటర్లు పెరిగిందని చెప్పారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ …
Read More »మంత్రి జగదీష్ సమక్షంలో టీఆర్ఎస్లోకి భారీ చేరికలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన అనుచరులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..నమ్మిన పార్టీని, నమ్ముకున్న ప్రజలను అమ్ముకోవడం …
Read More »చంద్రబాబుకు భద్రత పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రస్తుత భద్రతను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎన్ఎస్జీ కమాండోలు సెక్యూరిటీ ఉంది. దాన్ని నేటి నుంచి అదనంగా నలుగురిని నియమించారు. దీంతో మొత్తం 12 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు (NSG) పెంచారు. బాబు రోడ్ షో నిర్వహిస్తున్న తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల …
Read More »కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. మాజీ సీఎం గుడ్ బై
కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి.. తాజాగా ఆ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నేత.. ముఖ్యమంత్రిగా పని చేసిన అత్యంత అనుభవం ఉన్న గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. ఆయన ఈరోజు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ సీఎం ఆజాద్.. పార్టీకి చెందిన అన్ని పోస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అయిదు పేజీల …
Read More »