భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ఈ రోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈరోజు శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరుగనున్న కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి రవీంద్రభారతి వరకు, కార్యక్రమం ముగిసిన తర్వాత రవీంద్రభారతి నుంచి జూబ్లీహిల్స్ వరకు ట్రాఫిక్ ఆంక్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు.సాయంత్రం 5.30 …
Read More »హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మదాపూర్, షేక్పేట, టోలిచౌకి, రాయదుర్గం, గండిపేట, రాజేంద్రనగర్, కిస్మత్పర్, బండ్లగూడ జాగీర్ ప్రాంతాల్లో వర్షం పడుతున్నది. అత్తాపూర్, శివరాంపల్లి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తున్నది. కూకట్పల్లి, ఎల్లమ్మబండ, గోల్కొండతో పాటు తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుండగా.. వాహనాలు ఇబ్బందులకు గురయ్యారు. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చింతల్, గాజులరామారం, సుచిత్ర, ఆల్విన్ కాలనీ, హైదర్నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, కొంపల్లి భారీ …
Read More »Ap నిరుద్యోగ యువతకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మరో 1,500 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల నియామకాలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్య దర్శి కృష్ణబాబు తెలిపారు. ఆగస్టు 15 నాటికి ప్రతి YSR ఆసుపత్రిలో MLHPలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంలో PHCల్లో పనిచేసే ఇద్దరు వైద్యుల్లో ఒకరు.. 104 వాహనంలో వెళ్లి తమ సచివాలయ పరిధిలోని కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తారని కృష్ణబాబు చెప్పారు.
Read More »శుభమన్ గిల్ కు బ్యాడ్ లక్
వెస్టిండీస్ జట్టుతో నిన్న బుధవారం సాయంత్రం జరిగిన 3వ వన్డేలో టీమిండియా శుభమన్ గిల్ తృటిలో తనకేరీర్ లోనే తొలి సెంచరీ చేసే ఛాన్స్ ను కోల్పోయాడు. గిల్ 98 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం వల్ల ఆటను నిలిపివేశారు. దీంతో 2 పరుగుల దూరంలో గిల్ సెంచరీ కోల్పోయాడు. వర్షం వల్ల మ్యాచ్ ను కేవలం 40 ఓవర్లకు కుదించారు.. భారత్ 36 ఓవర్లలో 225 పరుగులు చేసింది. …
Read More »టీమిండియా రికార్డు
వెస్టిండీస్ జట్టుతో జరిగిన 3 వన్డేల సిరీస్ ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. 1983 నుంచి వెస్టిండీస్ తో జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్లు ఆడుతున్న భారత్ 39ఏళ్లలో తొలిసారి వెస్టిండీస్ గడ్డపై వెస్టిండీస్ ను ఓడించి క్లీన్ స్వీప్ చేసింది. టీమ్ ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్.. ఈ ఫీట్ సాధించిన తొలి భారత …
Read More »మంకీపాక్స్ పై కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో మంకీపాక్స్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వైరసు కట్టడి చేసే టీకా అభివృద్ధికి టెండర్లను ఆహ్వానించింది. ఆగస్టు 10లోగా ఆయా సంస్థలు తమ ఆసక్తిని తెలియజేయాలని కోరింది. అటు వైరస్ నిర్ధారణ కిట్ల తయారీకి కూడా ICMR టెండర్లు కోరింది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో వీటిని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. భారత్లో ఇప్పటి వరకు 4 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
Read More »ప్రెగ్నెన్సీ సమయంలో ఈ టిప్స్ కచ్చితంగా పాటించాలి
సహజంగా మహిళలకు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయని మనకు తెల్సిందే. ఈ క్రమంలో అండం పిండంగా మారే దశ నుంచి బిడ్డ పుట్టేంతవరకూ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాంతులు, వికారం, మలబద్ధకం, గుండెల్లో మంట, నడుం నొప్పితోపాటు కాలేయ సంబంధ రుగ్మతలు కూడా ఇబ్బంది పెడతాయి. వీటిని అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. › గర్భిణులను ఎక్కువగా వేధించే సమస్య అజీర్ణం. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. …
Read More »కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బహిష్కరణకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో మరింత నష్టం జరగకముందే ఆయనపై వేటు వేస్తే పార్టీ శ్రేణులకు బలమైన సంకేతాలు పంపినట్టుగా ఉంటుందని యోచిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో మునుగోడులో పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని కాదని కోమటిరెడ్డికి …
Read More »టీఎస్పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు కొలువులకై ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. తాజాగా టీఎస్పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర రవాణాశాఖలో 113 అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో 54 పోస్టులు మల్టీ జోన్-1లో ఉండగా, 59 పోస్టులు మల్టీ జోన్-2 పరిధిలో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు నెల …
Read More »అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించిన మంత్రులు
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నగరాలకు, పట్టణాలకు దగ్గర్లో ఉండే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అర్బన్ లంగ్ స్పేస్లుగా అర్భన్ ఫారెస్ట్ పార్క్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. …
Read More »