Home / rameshbabu (page 338)

rameshbabu

టీఆర్‌ఎస్‌ చెక్ రిపబ్లిక్ శాఖ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కోసం యూరప్ పర్యటనలో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేష్ బిగాల బుధవారం చెక్ రిపబ్లిక్‌లో ఎన్నారైలతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ చెక్ రిపబ్లిక్ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. ఇది టీఆర్‌ఎస్‌ పార్టీకి 52 వ ఎన్నారై శాఖ అని పేర్కొన్నారు.మిగతా యూరప్ దేశాల మాదిరిగానే ఇక్కడ కూడా విశేష …

Read More »

MP జోగినిపల్లి సంతోష్ కుమార్ కు “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు”

తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ను “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు” వరించింది. పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క 111వ జన్మదినాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని, వసంత్ నగర్ డా. బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో “వృక్షమాత పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క” చేతుల మీదుగా “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు” ను జోగినిపల్లి సంతోష్ కుమార్ …

Read More »

TRSలోకి భారీ చేరికలు

తెలంగాణలో జ‌న‌గామజిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం పాల‌కుర్తి మండ‌లం బ‌మ్మెర గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన 6వ వార్డు స‌భ్యురాలు ఒగ్గుల పావ‌ని ప‌ర‌శురాములు, మ‌రికొంద‌రు పార్టీ గ్రామ నాయ‌కులు 50 మంది కార్య‌క‌ర్త‌లు అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నేతృత్వంలో, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ స‌మక్షంలో వారు హైద‌రాబాద్ లోని మంత్రుల …

Read More »

దేశంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు

 దేశంలో గత నాలుగైదు రోజులు కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా కొత్తగా 18,819 మందికి కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది. దీంతో తాజాగా దేశ వ్యాప్తంగా నమోదైన  మొత్తం కరోనా  కేసులు 4,34,52,164కు చేరాయి. ఇందులో 4,28,22,493 మంది బాధితులు కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,116 మంది ఈ వైరస్ వల్ల మరణించారు. మరో 1,04,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, …

Read More »

మహరాష్ట్ర రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్

మహరాష్ట్రంలో బ‌ల‌ప‌రీక్ష ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ శివ‌సేన చీఫ్,ముఖ్యమంత్రి ఉద్ధవ్ తాక్రే నిన్న బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంను ఆశ్ర‌యించిన సంగతి విదితమే. దీనిపై నాలుగైదు గంటలు విచారించిన సుప్రీం కోర్టు ఆ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే.దీంతో మహ సీఎం పదవికి ఉద్ధ‌వ్ ఠాక్రే  నిన్న  రాజీనామా చేసిన సంగతి కూడా తెల్సిందే. అంతకుందే మహా గవర్నర్ గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఉద్ధవ్ తాక్రేకు ఆదేశాలను …

Read More »

తెలంగాణ గొప్పతనం గురించి మంత్రి కేటీఆర్ షాకింగ్ ట్వీట్

 తెలంగాణ రాష్ట్రం యొక్క  గొప్ప‌త‌నం తెలుసుకోవాలంటే గూగుల్‌ను అడ‌గాల‌ని  ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు ఎక్క‌డ ఉంది? ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేట‌ర్ ఎక్క‌డ ఉంది? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.ఈ రెండు తెలంగాణ‌లోనే ఉండ‌టం, వీటిని కేసీఆర్ ప్ర‌భుత్వ‌మే నిర్మించ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. వ్య‌వ‌సాయం నుంచి ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ వ‌ర‌కు అన్ని …

Read More »

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మే 23 నుంచి జూన్‌ 1 వరకు పది పరీ‌క్షలు నిర్వ‌హిం‌చారు. మొత్తం 5,08,143 రెగ్యు‌లర్‌ విద్యా‌ర్థు‌లకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీ‌క్షలు రాశారు. 167 మంది ప్ర‌యివేటు విద్యా‌ర్థు‌లకు 87 మంది పరీ‌క్ష‌లకు హాజ‌ర‌య్యారు. ఈ రోజు గురువారం ఉదయం పదో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ఉద‌యం 11:30 గంట‌ల‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫ‌లితాల‌ను విడుద‌ల …

Read More »

Telangana SSC Results-సత్తా చాటిన గురుకులాల విద్యార్థులు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు గురువారం విడుదలైన  ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో గురుకులకు చెందిన విద్యార్థులు త‌మ స‌త్తాను చాటారు. అటు ప్ర‌భుత్వ‌, ఇటు ప్ర‌యివేటు స్కూళ్ల‌ను దాటేసి విజ‌య‌ఢంకా మోగించారు. మొన్న విడుద‌లైన ఇంట‌ర్ ఫ‌లితాల్లోనూ గురుకుల విద్యార్థులు అత్య‌ధిక ఉత్తీర్ణ‌త శాతం సాధించి మొద‌టి వ‌రుస‌లో నిలిచారు. ఇవాళ విడుద‌లైన టెన్త్ ఫ‌లితాల్లో గురుకుల విద్యార్థులు అత్య‌ధికంగా 99.32 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు …

Read More »

జులై 2న హైద‌రాబాద్‌కు రానున్న విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా కి ఘనస్వాగతం

జులై 2వ తేదీన హైద‌రాబాద్‌కు రానున్నరు విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి శ్రీ య‌శ్వంత్ సిన్హా.ఈ నేప‌థ్యంలో య‌శ్వంత్ సిన్హాకు స్వాగ‌త ఏర్పాట్లు, ఆయ‌నకు మ‌ద్ధ‌తుగా నిర్వ‌హించే స‌భ‌పై హైద‌రాబాద్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో స‌మావేశం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ .య‌శ్వంత్ సిన్హాకు ఘ‌నంగా స్వాగతం ప‌లకాల‌ని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం. ఈ మేర‌కు ఏర్పాట్లు చేయాల‌ని ప్రజా ప్రతినిధులకు కేటీఆర్ …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 ఏపీ అధికార వైసీపీకి చెందిన శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శ్రీశైలంలో జరిగిన వైసీపీ ప్లీనరీ సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలకు  అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల మహిళలే తమకు ఓటు వేస్తారని  అన్నారు. ‘మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓటేస్తారు’ అని వ్యాఖ్యానించారు. సోషల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat