క్యాలీఫ్లవర్ తో లాభాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుస్కుందాం * దంత సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్ తింటే ఉపశమనం పొందొచ్చు. * ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు కడుపులో ఎసిడిటీని కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. * క్యాలీఫ్లవర్లో క్యాలరీలు తక్కువ కాబట్టి.. బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగం. * గుండె సంబంధిత సమస్యలకు కూడా చక్కగా పనిచేస్తుంది. * క్యాలీఫ్లవర్ రసం పరగడుపున తాగడం …
Read More »బూస్టర్ డోసు తీసుకుంటే లాభమా..? నష్టామా..?
రెండు డోసుల టీకా తీసుకున్నవారు 6 నెలల తరువాత కొవాగ్జిన్ బూస్టర్ డోసు వేయించుకుంటే కొవిడ్ నుంచి మెరుగైన రక్షణ పొందవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్లో ఈ ఫలితం వెల్లడైందని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదని స్పష్టం చేసింది. బూస్టర్ డోసు తీసుకున్న 90శాతం మందిలో కరోనా వైరస్ ఆల్ఫా, బీటీ, డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లను నివారించే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు భారత్ బయోటెక్ పేర్కొంది.
Read More »దేశంలో కొత్తగా 1,59,632 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,59,632 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 18వేల కేసులు ఎక్కువగా వచ్చాయి. పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 10.21%గా నమోదైంది. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 5లక్షల 90వేలు దాటింది. ఇక 24గంటల్లో కరోనా మహమ్మారితో మరో 327 మంది మరణించారు. 40,863 మంది కోలుకున్నారు.
Read More »దేశంలో భారీగా కరోనా కొత్త వేరియంట్ కేసులు
దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ మొత్తం 3,623 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. 27 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో వీటిని గుర్తించారు. మహరాష్ట్ర-1,009, ఢిల్లీ-513, కర్ణాటక-441, రాజస్థాన్-373 కేసులు రాగా.. TS-123, AP-28 కేసులు నమోదయ్యాయి. ఇక, మొత్తం బాధితుల్లో 1,409 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Read More »సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,సూపర్స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడైన రమేష్ బాబు (56) అనారోగ్యంతో మృతి చెందారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనని హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేశ్బాబు మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. రమేష్ బాబు మృతితో టాలీవుడ్ …
Read More »తెలంగాణకు అస్సాం సీఎం హిమాంత బిస్వా
తెలంగాణకు బీజేపీ ముఖ్యమంత్రులు ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ సీఎం రాగా.. ఆదివారం అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ వస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్టులో ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు స్వాగతం పలకనున్నారు. అస్సాం సీఎం బండి సంజయ్తో కలసి రోడ్డు మార్గంలో వరంగల్కు బయలుదేరతారు. మధ్యహాన్నం 12గంలకు ఉపాధ్యాయ, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై బండి సంజయ్తో కలసి హిమాంత …
Read More »బాబుపై ఆర్కే రోజా ఫైర్
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబుపై అధికార పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఆదివారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ దెబ్బకి విలవిలలాడి చంద్రబాబు కుప్పం బాట పెట్టారన్నారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసింది శూన్యమన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారని, ముందస్తు ఎన్నికలైనా… ఏ ఎన్నికలైనా ప్రజలు జగన్ వైపే …
Read More »GHMCలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
కొవిడ్ శరవేగంగా నగరాన్ని చుట్టేస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత నెలలో వచ్చిన మొత్తం కేసుల కంటే ఇప్పుడు కేవలం వారం రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం రోజుకు సగటున 576 వరకు కేసులు నమోదయితే, శనివారం ఒక్కరోజే 1,583 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన ఎనిమిది రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 6,610 మందికి వైరస్ సోకింది. …
Read More »మీ కేంద్రమంత్రులే మా రాష్ట్రాన్ని మెచ్చుకున్నారు-మంత్రి హారీష్ రావు
‘‘మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ నరహంతకుడు. పట్టపగలే ఆ రాష్ట్రంలో ఆరుగురు రైతులను కాల్చి చంపించిన చరిత్ర ఆయనది. ప్రభుత్వ ఉద్యోగాలను అంగట్లో అమ్ముకున్నారనే ఆరోపణలు ఆయన కుటుంబసభ్యులపై ఉన్నా యి. అవినీతి ఊబిలో మునిగి దొడ్డి దారిన ముఖ్యమంత్రిగా కుర్చీ ఎక్కిన ఘనత ఆయనది. అలాంటి నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి వచ్చి సీఎం కేసీఆర్ను విమర్శించడం సిగ్గుచేటు. ఏదిబడితే అది మాట్లాడొద్దు. ఇక్కడి అభివృద్ధిని …
Read More »విహారికి కూడా అవకాశాలు ఇవ్వాలి
దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య కేప్టాన్ లో జరగాల్సిన టెస్టు మ్యాచ్ లో అజింక్య రహానెకు బదులుగా విహారిని జట్టులో తీసుకోవాలని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. రెండో టెస్టుకు కోహ్లి దూరమవడంతో విహారికి అవకాశం ఇచ్చారు. మూడో టెస్టు కోసం కోహ్లి తిరిగి జట్టులో చేరనున్న నేపథ్యంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విహారికి కూడా అవకాశాలు ఇవ్వాలని, రహానె ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడని గౌతీ చెప్పాడు.
Read More »