Home / rameshbabu (page 615)

rameshbabu

దేశంలో కొత్తగా 26,964 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 26,964 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,31,498కి చేరింది. ఇందులో 3,27,83,741 మంది కోలుకున్నారు. 4,45,768 మంది కరోనా వల్ల మరణించారు. మరో 3,01,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. యాక్టివ్‌ కేసులు186 రోజుల్లో 3 లక్షల 2 వేలకు దిగువకు చేరడం ఇదే మొదటిసారి. కాగా, గత 24 గంటల్లో 34,167 మంది కోలుకున్నారని, 383 మంది కొత్తగా మృతిచెందారని కేంద్ర …

Read More »

అందరి సహాకారంతోనే ఆదిలాబాద్ అభివృద్ధి

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని వర్గాల వారి సహకారం అవసరమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్య, రాజకీయ వేత్తలతోపాటు ప్రతి పౌరుని భాగస్వామ్యం ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై మిడిల్ ప్లాంటేషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో సుమారు రూ.55 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను, సుందరీకరణ పనులను చేపడుతున్నామన్నారు. ఎప్పటికీ నిలిచిపోయే ఈ అభివృద్ధి పనుల్లో …

Read More »

మంత్రి కేటీఆర్ వినూత్న ట్వీట్

జీహెచ్‌ఎంసీలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కంటోన్మెంట్‌ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలంటూ మంత్రి ట్వీట్‌ చేశారు. ‘సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని చాలా మంది కోరుతున్నారు. విలీనం చేయాలనే వాదనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మరి మీరేమంటారు?’ అని ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ ప్రజలను ప్రశ్నించారు.

Read More »

కేంద్ర మంత్రితో మంత్రి తలసాని భేటీ…ఎందుకంటే..?

 కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి పరుషోత్తం రూపాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధికి, పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. తాము చేపడుతున్న కార్యక్రమాలకు, పథకాలకు కేంద్ర ప్రభుత్వం తరపున మద్దతు సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర …

Read More »

GHMCలో కొత్తగా 49 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో మరో 49 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 1,40,030 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More »

క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త

దేశవాళీ టోర్నీల్లో ఆడే క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. 40 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడిన సీనియర్ ఆటగాళ్లకు రూ.60వేలు, అండర్-23 ప్లేయర్లకు రూ.25వేలు, అండర్-19 ఆటగాళ్లకు రూ. 20వేల మ్యాచ్ ఫీజు ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే కరోనా కారణంగా గత సీజనక్కు గానూ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 50శాతం పరిహారం కింద ఇస్తున్నట్లు చెప్పారు.

Read More »

తన గొప్ప మనసును చాటుకున్న మంత్రి KTR

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు..ఎమ్మెస్సీ చదివి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజినీ అనే మహిళకు అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా మంత్రి కేటీఆర్ ఉద్యోగం ఇప్పించారు. ఔట్ సోర్సింగ్ విభాగంలో ఆమెకు ఉద్యోగం కల్పిస్తూ GHMC కమిషనర్ ఆర్డర్ జారీ చేశారు. ఇద్దరు ఆడపిల్లల తల్లి రజినీ రోజువారి కార్మికురాలిగా పనిచేస్తోంది. విషయం తెలుసుకున్న కేటీఆర్ ఈరోజు ఆమెను …

Read More »

హీరోయిన్ నందిత శ్వేత ఇంట విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి..తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి శివస్వామి మరణించారు. ఈ వార్తను నందిత ట్విటర్ ద్వారా పంచుకుంది. ‘నా తండ్రి శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో ఈరోజు కన్నుమూశారని నా శ్రేయోభిలాషులకు తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది. పలువురు సినిమా ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం …

Read More »

RCB పై KKR ఘనవిజయం

రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ ,కోలకత్తా నైట్ రైడర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ క ఘన విజయం సాధించింది. 93 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే 9వికెట్ల తేడాతో ఛేదించింది. కోల్ కత్తా జట్టులో శుభ్మన్ గిల్ 48(34బంతులు), వెంకటేశ్ అయ్యర్ 41 (27 బంతులు) రాణించారు. ఆఖర్లో గిలు ఔట్ చేసినా కేకేఆర్ విజయాన్ని కోహ్లి సేన అడ్డుకోలేకపోయింది. బెంగళూరు బౌలర్ చాహల్క ఒక …

Read More »

అర్హులైన ప్రతి కుటుంబానికి దళితబంధు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన కుటుంబాలకు అమలు చేస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కొత్తగా వివాహం అయినవారికి కూడా పథకం వర్తిస్తుందని తెలిపారు. అకౌంట్లలో పడిన డబ్బులను ప్రభుత్వం వెనక్కి తీసుకోదని, ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగులతోపాటు 65 ఏళ్లలోపు ఉన్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat